Post Offices: పోస్టాఫీసుల సిబ్బంది మోసాలు. 19 ఏళ్లలో రూ.96 కోట్లు స్వాహా
Post Offices: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్స్లోని పోస్టాఫీసుల్లో ఉన్న సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. గత 19 ఏళ్లలో దాదాపు రూ.96 కోట్లను స్వహా చేశారు. 2002-2021 మధ్య కాలంలో ఈ అవకతవకలు జరిగాయి. ఈ సొమ్ములన్నీ సేవింగ్స్ ఖాతాల్లోని ప్రజాధనమే కావటం గమనార్హం. జనం ఎంతో నమ్మకంతో దాచుకున్న ఈ డబ్బును ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వాడుకున్నారు.
ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో వెల్లడించింది. పోస్టాఫీసుల్లోని స్టాఫ్ మోసపూరిత విత్డ్రాయల్స్, ఫోర్జరీ, చీటింగ్ తదితర నేరాలకు పాల్పడ్డారని పేర్కొంది. దేశ వ్యాప్తంగా అన్ని సర్కిల్స్లోనూ ఇదే తంతు కొనసాగిందని తెలిపింది. కాగ్ సమర్పించిన ఈ ఆడిట్ రిపోర్టుని ప్రభుత్వం నిన్న పార్లమెంట్కు సమర్పించింది. పోస్టాఫీసుల్లో అవినీతి జరిగిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయి.
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
పశ్చిమ బెంగాల్, హర్యానా, త్రివేండ్రం, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిళ్లలో ఈ అక్రమ లావాదేవీల వల్ల వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. బాధ్యులపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశారు. నిందితులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని పంజాబ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు తెలిపాయి. తెలంగాణ, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల నుంచి స్పందన రావాల్సి ఉన్నట్లు కాగ్ పేర్కొంది.
Bihar Politics: బీజేపీతో జేడీయూ తెగదెంపులు.. గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన సీఎం నితీష్ కుమార్
పెట్రోల్కి పెరిగిన డిమాండ్
2021 జులైతో పోల్చితే 2022 జులైలో పెట్రోల్కి 6.1 శాతం డిమాండ్ పెరిగింది. 2022 జులైలో మొత్తం 17.62 మిలియన్ టన్నుల చమురు వాడకం జరిగింది. అయితే ఇది 2022 జూన్ కన్నా 5.7 శాతం తక్కువే. జూన్లో 18.68 మిలియన్ టన్నుల ఇంధనం వినియోగమైంది. ఈ వివరాలను పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ వెల్లడించింది. ఎల్పీజీ అమ్మకాలు 1.7% పెరిగి 2.41 మిలియన్ టన్నులకు చేరినట్లు తెలిపింది.
500 మందికి పైగా ఇంటికి
చికాగో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఇ-కామర్స్ సంస్థ 500 మందికి పైగా స్టాఫ్ని తొలగించింది. మొత్తం ఉద్యోగుల్లో ఈ సంఖ్య 15 శాతంతో సమానం. ఖర్చుల్ని తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా ఇలా చేసింది. ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగకపోవటంతో స్టాఫ్ని తీసేయాల్సి వస్తోందని సంస్థ సీఈఓ కేదార్ దేశ్పాండే వెల్లడించారు.
తాజావార్తలు
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!