Arvind Kejriwal: లిక్కర్ కేసులో నా పేరు లేదు.. ఇది రాజకీయ కుట్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తన అరెస్ట్ ‘రాజకీయ కుట్ర’ అని గురువారం ఆరోపించారు. ఈడీ కస్టడీ ఈరోజు ముగియడంతో మరో 7 రోజుల పాటు కస్టడీ కోరుతూ.. దర్యాప్తు సంస్థ రౌస్ ఎమెన్యూ కోర్టును ఆశ్రయించింది. కోర్టు గదిలోకి తీసుకువచ్చే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇది రాజకీయ కుట్ర అని, దీనికి ప్రజలే సమాధానం చెబుతారని కేజ్రీవాల్ అన్నారు. ఆప్ మంత్రులు అతిషి, గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్తో పాటు ముఖ్యమంత్రి సతీమణి సునీతా కేజ్రీవాల్ కోర్టుకి హాజరయ్యారు.
Read Also: Lemons: దేవుడా.. 9 నిమ్మకాయలు కేవలం రెండున్నర లక్షలే.. అసలు అంతలా ఏముంది వాటిలో..?!
Also Read
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
కోర్టులో కేజ్రీవాల్ సొంత వాదనలు వినిపించారు. ఈ కేసులో తనను ఇరికించడమే ఈడీ లక్ష్యమని అన్నారు. సీబీఐ 31 వేల పేజీల, ఈడీ 25 వేల పేజీల ఛార్జిషీటులో తన పేరు ఎక్కడా లేదని చెప్పారు. మాగుంట రాఘవ రెడ్డి ఇచ్చిన 7 స్టేట్మెంట్లలో ఆరింటిలో తన పేరు లేదని చెప్పారు. లిక్కర్ కేసులో రూ. 100 కోట్ల అవినీతి జరిగితే, ఆ డబ్బు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ తర్వాత రూ. 55 కోట్లని బీజేపీకి డొనేషన్ ఇచ్చారని అన్నారు. ఈడీకి రెండు లక్ష్యాలు ఉన్నాయని, తనను ఈ కేసులో ఇరికించడం, రెండోది ఆప్ పార్టీ లేకుండా చేయడమని ఆరోపించారు. నాపై ఎలాంటి కేసు లేదని, ఈడీకి నచ్చినన్ని రోజులు కస్టడీలో ఉంచుకోండి అని అన్నారు.
లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ని అరెస్ట్ చేయగా.. ఢిల్లీ కోర్టు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. మరో 7 రోజులు ఈడీ కస్టడీ కోరుతోంది. కేజ్రీవాల్ స్టేట్మెంట్ రికార్డు చేశామని, తప్పించుకునేలా సమాధానాలు చెబుతున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఆప్ గోవా ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిపి కేజ్రీవాల్ని ప్రశ్నించాలని చెప్పింది. ఈ కేసులో పంజాబ్ ఎక్సైజ్ అధికారులకు నోటీసులు ఇచ్చామని చెప్పింది.
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!