Digvijaya Singh: ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ ఫోటోతో రెచ్చగొట్టే ప్రయత్నం.. కాంగ్రెస్ నేతపై పోలీస్ కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Digvijaya Singh: కాంగ్రెస్ కీలక నేత దిగ్విజయ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్ పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టు చేశారు. దీనిపై ఆయనపై ఇండోర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. స్థానిక న్యాయవాది, ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ జోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిగ్విజయ్ పై చర్యలు చేపట్టారు. ఐపీసీ సెక్షన్ 469 (ప్రతిష్టకు హాని కలిగించే ఉద్దేశ్యంతో ఫోర్జరీ చేయడం), 500 (పరువు నష్టం) మరియు 505 (ప్రజా దుష్ప్రవర్తనకు దారితీసే ప్రకటనలు) కింద తుకోగంజ్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఎఫ్ఐఆర్ నమోదైంది.
Read Also: Bandi Sanjay: బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం.. బండి సంజయ్ కు జాతీయ స్థాయి బాధ్యతలు
Also Read
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
దళితులు, వెనకబడినవారు, ముస్లింలు, హిందువుల మధ్య వివాదాలను సృష్టించడం ద్వారా ప్రజలను రెచ్చగొట్టేందుకు గురూజీ( గోల్వార్కర్) ప్రయత్నించినట్లు ఆయన చిత్రంతో కూడిన పోస్టర్ ని దిగ్విజయ్ సింగ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దీనిపై రాజేష్ జోషి ఫిర్యాదు చేశారు. గోల్వాల్కర్ పై దిగ్విజయ్ సింగ్ పోస్టు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, మొత్తం హిందూ సమాజం యొక్క మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గోల్వాల్కర్ గురించి దిగ్విజయ్ సింగ్ తప్పుడు, అనవసరమైన పోస్ట్ చేశారని జోషి ఆరోపించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన ఫోటోను దిగ్విజయ్ శనివారం ట్వీట్ చేశారు. దళితులు, వెనుకబడినవారు, ముస్లింలకు సమాన హక్కులు కల్పించడం కంటే బ్రిటీష్ పాలనలో జీవించడమే తనకు ఇష్టమని గోల్వాల్కర్ చెప్పారని పోస్టులో ఆయన ఆరోపించారు. గోవాల్కర్ ఎప్పుడూ కూడా అలాంటి వ్యాఖ్యలు చేయలేదిన ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త సునీల్ అంబేకర్ అన్నారు. గోవాల్కర్ ఆర్ఎస్ఎస్ సంస్థకు ఎక్కువ కాలం చీఫ్ గా పనిచేశారు. అందరూ ఆయన్ను గురూజీ అని పిలుచుకునే వారు. 1940-73 మధ్య కాలంలో ఆ సంస్థకు నాయకత్వం వహించారు.
https://twitter.com/digvijaya_28/status/1677464306202574848
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!