Amit Shah: “75 ఏళ్లలో పీఎం మోడీ రిటైర్ అవుతారన్న కేజ్రీవాల్”.. స్పందించిన అమిత్ షా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి నిన్న ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీని, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. వచ్చే రోజుల్లో అమిత్ షాని ప్రధానిని చేసేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తు్న్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘‘ఒకే దేశం-ఒకే నాయకుడి’’ కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ ఇండియా కూటమికి ప్రధాని ఎవరని బీజేపీ అడుగుతోంది. నేను బీజేపీని వారి ప్రధాన మంత్రి ఎవరని అడుగుతున్నాను..? మోడీ జీ వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 నాటికి 75 ఏళ్లు పూర్తిచేసుకుంటారు. 75 ఏళ్ల వయసులో ఉన్న వారు పదవీ విరమణ చేస్తారని ఆయన స్వయంగా 2014లో నిబంధన పెట్టారు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్ వంటివారు పదవీ విరమణ చేశారు’’ అని అన్నారు.
Read Also: Paul Stirling: పాక్ జట్టును ఘోరంగా అవమానించిన ఐర్లాండ్ కెప్టెన్.. అసలు మ్యాటరెంటంటే..
Also Read
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
ప్రధాని నరేంద్రమోడీ అమిత్ షాని ప్రధానిని చేసేందుకు ఓట్లు అడుగుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. మోడీజీ హామీలను అమిత్ షా నెరవేరుస్తారా..? అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పక్కకు తప్పుకుంటారని కేజ్రీవాల్ తప్పుగా భావిస్తున్నారని అన్నారు. ‘‘ బీజేపీ రాజ్యాంగంలో అలాంటి (75 ఏళ్ల పరిమితి) ఏమీ లేదు. కేజ్రీవాల్ అండ్ కంపెనీ, ఇండియా కూటమికి నేను చెప్పాలనుకుంటున్నాను. పీఎం మోడీ ఈ సారి కూడా పదవీ కాలాన్ని పూర్తిచేయబోతున్నారు. పీఎం మోడీనే అధికారంలో ఉంటారు. బీజేపీలో ఎలాంటి గందరగోళం లేదు’’ అని షా స్పష్టం చేశారు.
అమిత్ షా మాట్లాడుతూ..కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్పై వచ్చాడని, తన అరెస్టు అక్రమం అంటూ సుప్రీంకోర్టు ముందు చెప్పినా కూడా ఉపశమనం లభించలేదని, మధ్యంతర బెయిల్ జూన్ 1 వరకు మాత్రమే ఇవ్వబడిందని, ఆ తర్వాత ఆయన లొంగిపోవాలని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ దీనిని క్లీన్చిట్గా భావిస్తే, చట్టంపై ఆయనకు ఉన్న అవగాహన బలహీనం అని అన్నారు.
తాజావార్తలు
-
TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే బ్యాటర్గా ఘనత..
-
Moringa Health Benefits: మునగను ‘మిరాకిల్ ట్రీ’ అని ఎందుకు అంటారు? కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!