Gujarat Bridge Collapse: ఈ రోజు మోర్బీలో ప్రధాని పర్యటన.. ఆస్పత్రికి హుటాహుటిన రంగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi visit to Morbi today: మోర్బీ వంతెన కూలిన ఘటన యావత్ దేశాన్ని విషాదంలో ముంచింది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 141 మంది మరణించారు. సమయం గడుస్తున్నా కొద్ధీ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉండటం అందర్ని కలిచివేస్తోంది. ఇదిలా ఉంటే ఈ రోజు(మంగళవారం) ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నారు ప్రధాని నరేంద్రమోదీ. అక్కడే ముఖ్యమంత్రి, అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించనున్నారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. ఈ ఘటనలో మరణించిన వారికి ప్రధాని రూ. 2లక్షల పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 ప్రకటించారు. మరోవైపు గుజరాత్ ప్రభుత్వం మరణించిన వారికి రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారాన్ని ప్రకటించింది.
Read Also: Joe Biden: భారతీయులకు అండగా ఉంటాం.. మోర్బీ వంతెన ఘటనపై బైడెన్ సంతాపం
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
ఇదిలా ఉంటే ప్రధాని పర్యటన నేపథ్యంలో లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ఆస్పత్రులకు రంగులు వేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, ఆప్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మోదీ పర్యటన నేపథ్యంలో మోర్బీలోని సివిల్ం ఆస్పత్రికి రంగులు వేస్తున్న ఫోటోలను చూపిస్తూ.. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆప్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆస్పత్రికి రంగులు వేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. బీజేపీని విమర్శించింది. 141 మంది చనిపోయారు. వందలాది మంది తప్పిపోయారు, అసలు దోషులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. కానీ బీజేపీ కార్యకర్తలు మాత్రం ఫోటోషూట్ కు సిద్ధమయ్యే పనిలో నిమగ్నమయ్యారని ట్వీట్ చేసింది.
కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టింది. ఆస్పత్రిలో టైల్స్ వేస్తున్న ఫోటోలును షేర్ చేసింది. ప్రధానిని ఉద్దేశిస్తూ.. వారికి సిగ్గు లేదు.. చాలా మంది చనిపోయారని..కానీ వారు ఓ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారని విమర్శించింది. గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి హేమంగ్ రావల్ మాట్లాడుతూ.. మోర్చిలోని సివిల్ ఆస్పత్రిలో పెయింటింగ్, డెకరేషన్ పనులు జరుగుతున్నాయని.. బీజేపీ కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుందని.. పెయింటింగ్, డెకరేషన్ బదులు బాధితులకు మంచి చికిత్స అందిచాలని డిమాండ్ చేశారు.
ఆస్పత్రిని సిద్ధం చేసేందుకు రాజ్ కోట్ నుంచి సిబ్బందిని తీసుకువచ్చారు. కలర్లతో పాటు, టైల్స్ వర్క్, కొత్త కూలర్లు, హస్పిటల్ బెడ్లను ఏర్పాటు చేశారు.
त्रासदी का इवेंट
कल PM मोदी मोरबी के सिविल अस्पताल जाएंगे। उससे पहले वहां रंगाई-पुताई का काम चल रहा है। चमचमाती टाइल्स लगाई जा रही हैं।
PM मोदी की तस्वीर में कोई कमी न रहे, इसका सारा प्रबंध हो रहा है।
इन्हें शर्म नहीं आती! इतने लोग मर गए और ये इवेंटबाजी में लगे हैं। pic.twitter.com/MHYAUsfaoC
— Congress (@INCIndia) October 31, 2022
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!