PM Narendra Modi: 60 ఏళ్లలో కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేసింది.. బురద విసిరితే కమలం అంత వికసిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని నరేంద్రమోదీ రాజ్యసభలో ధన్యవాద తీర్మానానికి సమాధానం ఇస్తూ మరోసారి కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రధాని ప్రసంగం సమయంలో ప్రతిపక్షాలు మోదీ-అదానీ భాయ్ భాయ్ అని నినాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. బుధవారం లోక్ సభలో సమాధానం ఇచ్చిన ఆయన, గురువారం రాజ్యసభలో కూడా కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు.
Read Also: INDvsAUS 1st Test: అదరగొట్టిన జడేజా, అశ్విన్.. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 177 ఆలౌట్
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
విపక్షాల తీరు చూస్తుంటే చాలా బాధగా ఉందని.. కాంగ్రెస్ పాలనను దగ్గర నుంచి చూశా అని, ఆరు దశాబ్ధాల కాంగ్రెస్ పాలన అంతా శుద్ధ దండగ అని, ఇతర దేశాలు అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ భారత దేశాన్ని నాశనం చేసిందని విమర్శించారు. దేశప్రజలు కాంగ్రెస్ పార్టీని నిరాకరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో గరీబీ హఠావో కేవలం నినాదమే అని, మధ్యవర్తుల చేతుల్లోకి డబ్బులు వెళ్లేవని తెలిపారు. దేశ ప్రజలను కాంగ్రెస్ వంచించిందని.. నేను ఎప్పుడూ రాజకీయాలను లబ్ధి కోసం చూడలేదని ఆయన వెల్లడించారు. పేదలను బ్యాంకింగ్ వ్యవస్థలో భాగం చేశామని తెలిపారు. దశాబ్ధాలుగా ఆదివాసీలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని.. బడ్జెట్ లో మా ప్రభుత్వం లక్షా 20 వేల కోట్లను గిరిజనుల కోసం కేటాయించామని పేర్కొన్నారు. 13 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని అన్నారు.
గత 3-4 ఏళ్లలో 11 కోట్ల ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చామని.. జన్ ధన్ ఖతా ఉద్యమాన్ని ప్రారంభించి.. గత 9 ఏళ్లలో 48 కోట్ల జన్ ధన్ ఖాతాలను తెరిచామని సభలో పీఎం మోదీ చెప్పారు. కర్ణాటక కలబురిగిలో 8 లక్షల ఖాతాలతో సహా కర్ణాటకలో 1.70 కోట్ల జన్ ధన్ ఖాతాలను ప్రారంభించామని దీన్ని మల్లిఖార్జున ఖర్గే చూడాలని సూచించారు. ఒకరి ఖాతా మూసేయబడుతోంది.. వారి బాధను అర్థం చేసుకోగలను అంటూ కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు. దేశంలోని 25 కోట్ల కుటుంబాలకు ఎల్పిజి కనెక్షన్లను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. నిజమైన లౌకికవాదం వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులందరికీ చేరేలా చూస్తోందని తెలిపారు. దేశంలో 110 వెనకబడిన జిల్లాలను గుర్తించి ఆ జిల్లాల్లో విద్యా, మౌళిక సదుపాయాలు, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరిచామని వెల్లడించారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!