PM Modi: నీట్ విద్యార్థుల కోసం ఎయిర్పోర్టులోనే ఆగిన ప్రధాని మోడీ..
- నీట్ విద్యార్థుల కోసం ఎయిర్పోర్టులోనే ప్రధాని మోడీ..
- ట్రాఫిక్ అవాంతరాలు కలుగొద్దని 45 నిమిషాల పాటు వెయిటింగ్..
- పరీక్ష ప్రారంభమైన తర్వాతే బయలుదేరిన ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: నీట్-యూజీసీ విద్యార్థులకు ఎలాంటి అంతరాయం కలుగొద్దని ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోడీ శనివారం ఢిల్లీలో విమానాశ్రయంలోనే 45 నిమిషాల పాటు వేచి ఉన్నారు. పరీక్షా సెంటర్లకు వెళ్లే విద్యార్థులకు ట్రాఫిక్ అవాంతరాలు ఏర్పడొద్దని ప్రధాని ఇలా చేశారు. ప్రధాని మధ్యామ్నం 1.15 గంటలకు బెంగాల్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నీట్ పరీక్ష ప్రారంభం కావాల్సి ఉన్నందున, వెంటనే తన నివాసానికి వెళ్లకుండా ఎయిర్పోర్టులోనే కొంత సమయం ఉన్నారు. తన కాన్వాయ్, ట్రాఫిక్ ఆంక్షల వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకావొద్దని ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షా ప్రారంభమైన తర్వాత, ప్రధాని మోడీ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లారు.
అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వల్ల నీట్ రీ-ఎగ్జామ్ జరుగుతోంది. ఈ పరీక్ష కోసం కేంద్రం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. భారతదేశంలోని 5,440 కేంద్రాలలో మరియు విదేశాల్లోని 14 కేంద్రాలలో 22 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం ఎన్టీఏ విస్తృత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసింది. . 95,000కు పైగా పరీక్షా గదులను 1.38 లక్షల సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు, వీటికి ఏఐ (AI) ఆధారిత నిఘా కూడా తోడవుతోంది. అదే సమయంలో, ఎలక్ట్రానిక్ మోసాలను నివారించడానికి 51,000కు పైగా సిగ్నల్ జామ్మర్లను కూడా ఏర్పాటు చేశారు. పరీక్ష సజావుగా జరిగేందుకు భద్రతా ఏర్పాట్లలో 6700 మంది పరిశీలకులు, 100 మందికి పైగా వర్చువల్ మానిటర్లు, దాదాపు 39 వేల మంది ఫ్రిస్కింగ్ సిబ్బంది, 48 వేలకు పైగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిబ్బంది విధుల్లో ఉన్నారు.
Also Read
- LPG: వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. ఆగస్టు 23 వరకు ఛాన్స్..
- BJP: యూపీ ఎన్నికల ముందు బీజేపీలో పదవుల జాతర.. పురందేశ్వరికి కీలక పదవి
- Supreme Court: నిబంధనలు పాటించని విమాన సంస్థలు నిలిపేయండి.. కేంద్రానికి ఆదేశం
- Jobless: డిగ్రీలు ఉన్నా జాబ్ దొరకకపోవడానికి కారణం ఇదేనా..? వైరల్ అవుతున్న నిరుద్యోగి సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
LPG: వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. ఆగస్టు 23 వరకు ఛాన్స్..
-
BJP: యూపీ ఎన్నికల ముందు బీజేపీలో పదవుల జాతర.. పురందేశ్వరికి కీలక పదవి
-
Korean Kanakaraju: సైలెంటుగా 50 కోట్లు కొట్టిన కొరియన్ కనకరాజు
-
Suriya Vs Lokesh: లోకేష్ కనగరాజ్’కు సూర్య మార్క్ షాక్?
-
Deputy CM Pawan Kalyan: తొలి విమానం ల్యాండింగ్.. ఉత్తరాంధ్ర ప్రగతికి కొత్త అధ్యాయంగా అభివర్ణించిన పవన్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!