PM Modi Appeal: ప్రధాని మోడీ ప్రత్యేక విజ్ఞప్తి.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Appeal: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఎండల తీవ్రత కారణంగా సాధారణ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతున్నాయని ప్రధాని తెలిపారు. దీంతో రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావం పడుతోందని, ముఖ్యంగా ఎండ వేడి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ప్రజలు శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని సూచించారు ప్రధాని మోడీ… బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తాగునీరు వెంట తీసుకెళ్లాలని, వీలైనంత వరకు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్త పడాలని కోరారు. అలాగే సమాజంలో పరస్పర సహకారం ఎంతో అవసరమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దాహంతో ఉన్న వారికి ఒక గ్లాస్ నీరు అందించడం కూడా గొప్ప సేవేనని చెప్పారు. ఇళ్ల ముందు, దుకాణాల బయట మట్టికుండల్లో తాగునీరు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టి, ఎవరైనా వచ్చి నీళ్లు తాగేందుకు అవకాశం కల్పిస్తున్న వారిని ప్రధాని అభినందించారు. తీవ్రమైన ఎండల సమయంలో మానవత్వంతో ముందుకు వచ్చి ఇతరులకు సాయం చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టారు ప్రధాని మోడీ..
Also Read
- Operation Sindoor: ఆపరేషన్ సింధూర్లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
- Arunachal Pradesh: అరుణాచల్లో చైనా చొరబాటుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- CJI Surya Kant: ‘సీజేఐ సూర్యకాంత్ తండ్రిలాంటి వారు’.. బార్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు ప్రశంసలు
- Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
Different parts of India are witnessing soaring temperatures and the challenges that come with it. This heat is harsh on all of us and I urge you all to take as many precautions as possible. Please stay hydrated, keep water with you when stepping out. Offer a glass of water to…
— Narendra Modi (@narendramodi) May 27, 2026
తాజావార్తలు
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
-
Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: ‘స్పెషల్ థియేటర్స్’ కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
-
Door Lock Care Tips: వానలకు మీ ఇంటి తాళాలు పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్స్తో కొత్తవాటిలా మెరిపించండి!
-
Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు
-
Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ ‘నయ్యి నవెల్లి’
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!