Har Ghar Tiranga Campaign: ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయండి.. ప్రధాని పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరుస ట్వీట్ల వర్షం కురిపించారు. ఆగస్టు 13, 14 తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం లేదా ప్రదర్శించడం చేయాలని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో.. 1947 జులై 22న త్రివర్ణ పతాకాన్ని ఆమోదించిన సందర్భంగా మోదీ వరుస ట్వీట్లు చేశారు. కాగా.. హర్ ఘర్ తిరంగా ఉద్యమం త్రివర్ణ పతాకంతో మనకున్న అనుబంధాన్ని మరింత పెంచుతుందని మోదీ అన్నారు. అంతేకాకుండా.. వలస పాలనలో స్వేచ్ఛా భారతం, త్రివర్ణ పతాక రెపరెపల కోసం పోరాడిన వారి ధైర్యాన్ని, కృషిని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు ప్రధాని. అయితే.. వారి ఆశయాలను నెరవేర్చేందుకు, తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈనేపథ్యంలో.. త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా స్వీకరించడానికి దారి తీసిన అధికారిక సమాచార వివరాలను సైతం మోడీ ట్విట్టర్లో షేర్ చేశారు.
అయితే ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వీడ్కోలు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విందును ఇస్తున్నారు. ఈనేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు మొగులయ్య, రామచందర్ రావులను కూడా ఆహ్వానించినట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాకు చెప్పారు.ఈనేపథ్యంలో.. మరో వైపు NDA భాగస్వామ్య పార్టీలతో పాటు విపక్ష పార్టీలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అయితే.. రేపు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విందు ఇవ్వనున్నారు .ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్ర మంత్రులతో పాటు పలువురికి కోవింద్ విందు ఇవ్వనున్నారు. కాగా.. ఇవాళ ఉదయం తిరుపతి నుంచి వచ్చిన అర్చకులు ద్రౌపది ముర్మును ఆశీర్వదించారు. తిరుపతి వెంకటేశ్వరస్వామికి చెందిన ప్రసాదాన్ని అందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ద్రౌపది ముర్మును అభినందించేందుకు పలువురు ఆమె ఇంటికి క్యూ కట్టారు, అయితే.. ఈ నెల 25వ తేదీన ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
This year, when we are marking Azadi Ka Amrit Mahotsav, let us strengthen the Har Ghar Tiranga Movement. Hoist the Tricolour or display it in your homes between 13th and 15th August. This movement will deepen our connect with the national flag. https://t.co/w36PqW4YV3
— Narendra Modi (@narendramodi) July 22, 2022
తాజావార్తలు
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!