Har Ghar Tiranga Campaign: ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయండి.. ప్రధాని పిలుపు
హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరుస ట్వీట్ల వర్షం కురిపించారు. ఆగస్టు 13, 14 తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం లేదా ప్రదర్శించడం చేయాలని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో.. 1947 జులై 22న త్రివర్ణ పతాకాన్ని ఆమోదించిన సందర్భంగా మోదీ వరుస ట్వీట్లు చేశారు. కాగా.. హర్ ఘర్ తిరంగా ఉద్యమం త్రివర్ణ పతాకంతో మనకున్న అనుబంధాన్ని మరింత పెంచుతుందని మోదీ అన్నారు. అంతేకాకుండా.. వలస పాలనలో స్వేచ్ఛా భారతం, త్రివర్ణ పతాక రెపరెపల కోసం పోరాడిన వారి ధైర్యాన్ని, కృషిని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు ప్రధాని. అయితే.. వారి ఆశయాలను నెరవేర్చేందుకు, తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈనేపథ్యంలో.. త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా స్వీకరించడానికి దారి తీసిన అధికారిక సమాచార వివరాలను సైతం మోడీ ట్విట్టర్లో షేర్ చేశారు.
అయితే ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వీడ్కోలు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విందును ఇస్తున్నారు. ఈనేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు మొగులయ్య, రామచందర్ రావులను కూడా ఆహ్వానించినట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాకు చెప్పారు.ఈనేపథ్యంలో.. మరో వైపు NDA భాగస్వామ్య పార్టీలతో పాటు విపక్ష పార్టీలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అయితే.. రేపు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విందు ఇవ్వనున్నారు .ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్ర మంత్రులతో పాటు పలువురికి కోవింద్ విందు ఇవ్వనున్నారు. కాగా.. ఇవాళ ఉదయం తిరుపతి నుంచి వచ్చిన అర్చకులు ద్రౌపది ముర్మును ఆశీర్వదించారు. తిరుపతి వెంకటేశ్వరస్వామికి చెందిన ప్రసాదాన్ని అందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ద్రౌపది ముర్మును అభినందించేందుకు పలువురు ఆమె ఇంటికి క్యూ కట్టారు, అయితే.. ఈ నెల 25వ తేదీన ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు.
Also Read
This year, when we are marking Azadi Ka Amrit Mahotsav, let us strengthen the Har Ghar Tiranga Movement. Hoist the Tricolour or display it in your homes between 13th and 15th August. This movement will deepen our connect with the national flag. https://t.co/w36PqW4YV3
— Narendra Modi (@narendramodi) July 22, 2022
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో