NTV Telugu Site icon

PM Modi’s US Tour: న్యూయార్క్‌లో ప్రధాని మోడీ మెగా ఈవెంట్‌.. భారీ స్పందన

Modi

Modi

PM Modi’s US Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తుంది. అమెరికాలో సెప్టెంబర్‌ 22వ తేదీన ‘మోడీ & యూఎస్‌ ప్రోగ్రెస్‌ టు గెదర్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి నసావు వెటరన్స్‌ మెమోరియల్‌ కొలీజియం వేదికగా మారింది. అయితే, ఈవెంట్‌కు అనూహ్య స్పందన వస్తుంది. దీని కోసం ఇప్పటికే 24 వేల మంది ప్రవాస భారతీయులు తమ పేర్లు రిజిస్ట్రర్ చేసుకున్నట్లుగా ఇండో- అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్‌ఏ పేర్కొనింది. ఈ వేదిక సామర్థ్యం 15 వేలు మాత్రమే ఉంది.. భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతో మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి 42 రాష్ట్రాల నుంచి భారతీయ అమెరికన్లు పెద్ద ఎత్తున హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

Read Also: AP Cabinet Key Decisions: కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. వీటికి గ్రీన్‌ సిగ్నల్‌..

ఇక, ‘అనుకున్న దానికంటే ఎక్కువ మంది ఈ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వారందరికీ సీటింగ్ ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ఈవెంట్లో భారత-అమెరికన్ కమ్యూనిటీకి ఎంతో ముఖ్యమైంది. దీనిని సక్సె్స్ ఫుల్ గా నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో నరేంద్ర మోడీ ప్రసంగంతో పాటు వివిధ భారతీయ-అమెరికన్ల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. మరోవైపు ఐరాస జారీ చేసిన తాత్కాలిక స్పీకర్ల జాబితా ప్రకారం సెప్టెంబర్ 26వ తేదీన ఇక్కడ జరిగే అత్యున్నత స్థాయి యూఎన్‌ జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత ప్రధాని ప్రసంగించనున్నారు.

Read Also: Bolisetty Srinu: అల్లు అర్జున్ విషయంలో వెనక్కి తగ్గిన జనసేన ఎమ్మెల్యే?

అయితే, 2014లో తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం న్యూయార్క్‌లో జరిగిన భారీ కమ్యూనిటీ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ప్రఖ్యాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఈ ఈవెంట్ నిర్వహించారు. ఆ తర్వాత 2019లో టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లోని ఎన్ఆర్జీ స్టేడియంలో జరిగిన మెగా కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సైతం ఈ ప్రోగ్రామంలో పాల్గొన్నారు.