PM Modi’s US Tour: న్యూయార్క్లో ప్రధాని మోడీ మెగా ఈవెంట్.. భారీ స్పందన
- వచ్చే నెల అమెరికా పర్యటనకు భారత ప్రధాని మోడీ..
- ‘మోడీ & యూఎస్ ప్రోగ్రెస్ టు గెదర్’ ఈవెంట్ లో పాల్గొననున్న నరేంద్ర మోడీ..
- ఈ కార్యక్రమానికి 42 రాష్ట్రాల నుంచి భారతీయ అమెరికన్లు హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi’s US Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తుంది. అమెరికాలో సెప్టెంబర్ 22వ తేదీన ‘మోడీ & యూఎస్ ప్రోగ్రెస్ టు గెదర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి నసావు వెటరన్స్ మెమోరియల్ కొలీజియం వేదికగా మారింది. అయితే, ఈవెంట్కు అనూహ్య స్పందన వస్తుంది. దీని కోసం ఇప్పటికే 24 వేల మంది ప్రవాస భారతీయులు తమ పేర్లు రిజిస్ట్రర్ చేసుకున్నట్లుగా ఇండో- అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ పేర్కొనింది. ఈ వేదిక సామర్థ్యం 15 వేలు మాత్రమే ఉంది.. భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి 42 రాష్ట్రాల నుంచి భారతీయ అమెరికన్లు పెద్ద ఎత్తున హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
Read Also: AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. వీటికి గ్రీన్ సిగ్నల్..
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
ఇక, ‘అనుకున్న దానికంటే ఎక్కువ మంది ఈ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారందరికీ సీటింగ్ ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ఈవెంట్లో భారత-అమెరికన్ కమ్యూనిటీకి ఎంతో ముఖ్యమైంది. దీనిని సక్సె్స్ ఫుల్ గా నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో నరేంద్ర మోడీ ప్రసంగంతో పాటు వివిధ భారతీయ-అమెరికన్ల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. మరోవైపు ఐరాస జారీ చేసిన తాత్కాలిక స్పీకర్ల జాబితా ప్రకారం సెప్టెంబర్ 26వ తేదీన ఇక్కడ జరిగే అత్యున్నత స్థాయి యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత ప్రధాని ప్రసంగించనున్నారు.
Read Also: Bolisetty Srinu: అల్లు అర్జున్ విషయంలో వెనక్కి తగ్గిన జనసేన ఎమ్మెల్యే?
అయితే, 2014లో తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం న్యూయార్క్లో జరిగిన భారీ కమ్యూనిటీ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ప్రఖ్యాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఈ ఈవెంట్ నిర్వహించారు. ఆ తర్వాత 2019లో టెక్సాస్లోని హ్యూస్టన్లోని ఎన్ఆర్జీ స్టేడియంలో జరిగిన మెగా కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ ప్రోగ్రామంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!