PM Modi’s US Tour: న్యూయార్క్లో ప్రధాని మోడీ మెగా ఈవెంట్.. భారీ స్పందన
- వచ్చే నెల అమెరికా పర్యటనకు భారత ప్రధాని మోడీ..
- ‘మోడీ & యూఎస్ ప్రోగ్రెస్ టు గెదర్’ ఈవెంట్ లో పాల్గొననున్న నరేంద్ర మోడీ..
- ఈ కార్యక్రమానికి 42 రాష్ట్రాల నుంచి భారతీయ అమెరికన్లు హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi’s US Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తుంది. అమెరికాలో సెప్టెంబర్ 22వ తేదీన ‘మోడీ & యూఎస్ ప్రోగ్రెస్ టు గెదర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి నసావు వెటరన్స్ మెమోరియల్ కొలీజియం వేదికగా మారింది. అయితే, ఈవెంట్కు అనూహ్య స్పందన వస్తుంది. దీని కోసం ఇప్పటికే 24 వేల మంది ప్రవాస భారతీయులు తమ పేర్లు రిజిస్ట్రర్ చేసుకున్నట్లుగా ఇండో- అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ పేర్కొనింది. ఈ వేదిక సామర్థ్యం 15 వేలు మాత్రమే ఉంది.. భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి 42 రాష్ట్రాల నుంచి భారతీయ అమెరికన్లు పెద్ద ఎత్తున హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
Read Also: AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. వీటికి గ్రీన్ సిగ్నల్..
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
ఇక, ‘అనుకున్న దానికంటే ఎక్కువ మంది ఈ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారందరికీ సీటింగ్ ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ఈవెంట్లో భారత-అమెరికన్ కమ్యూనిటీకి ఎంతో ముఖ్యమైంది. దీనిని సక్సె్స్ ఫుల్ గా నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో నరేంద్ర మోడీ ప్రసంగంతో పాటు వివిధ భారతీయ-అమెరికన్ల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. మరోవైపు ఐరాస జారీ చేసిన తాత్కాలిక స్పీకర్ల జాబితా ప్రకారం సెప్టెంబర్ 26వ తేదీన ఇక్కడ జరిగే అత్యున్నత స్థాయి యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత ప్రధాని ప్రసంగించనున్నారు.
Read Also: Bolisetty Srinu: అల్లు అర్జున్ విషయంలో వెనక్కి తగ్గిన జనసేన ఎమ్మెల్యే?
అయితే, 2014లో తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం న్యూయార్క్లో జరిగిన భారీ కమ్యూనిటీ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ప్రఖ్యాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఈ ఈవెంట్ నిర్వహించారు. ఆ తర్వాత 2019లో టెక్సాస్లోని హ్యూస్టన్లోని ఎన్ఆర్జీ స్టేడియంలో జరిగిన మెగా కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ ప్రోగ్రామంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
-
CM Revanth Reddy : కేసీఆర్కు రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
-
Zim vs Ban: ‘ఇన్నోసెంట్ కైయా’ సెంచరీ.. బంగ్లాదేశ్పై ఇన్నింగ్స్ తేడాతో జింబాబ్వే ఘన విజయం.!
-
2026 Half Year: అర్థ సంవత్సరంలో అంతర్జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
-
Trisha: త్రిష పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!