New Parliament: మే 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. జాతికి అంకితం చేయనున్న ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Parliament: కేంద్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోదీ మే 28న ప్రారంభించనున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం రోజు ప్రధాని నరేంద్రమోడీని కలిసి కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించారు. నాలుగు అంతస్తుల్లో 1200 మంది ఎంపీలకు సరిపడేలా, అనేక సౌకర్యాలతో కొత్త పార్లమెంట్ ను నిర్మించారు. ‘‘కొత్త భవనం స్వావలంబన భారతదేశం లేదా ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తికి ప్రతీక’’ అని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు.
Read Also: Siddaramaiah: సీఎల్పీ లీడర్ గా సిద్దరామయ్య ఎన్నిక.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం
Also Read
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
కొత్త పార్లమెంట్ భవనాన్ని మోడీ ప్రభుత్వ తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా భారీ వేడుకల మధ్య ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి మే 26, 2023తో తొమ్మిదేళ్లు పూర్తవుతాయి. డిసెంబర్ 2020లో కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కొత్త భవనం సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పునరాభివృద్ధిలో భాగంగా ఉంది.
టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ఈ కొత్త పార్లమెంట్ ను నిర్మించింది. భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వానికి గుర్తుగా గొప్ప రాజ్యాంగ మందిరం, పార్లమెంట్ సభ్యుల కోసం లాంజ్, లైబ్రరీ, పార్లమెంట్ కమిటీల కోసం గదులు, విశాలవంతమైన పార్కింగ్ స్థలం ఉండనున్నాయి. కొత్త పార్లమెంట్ లో లోక్ సభ, రాజ్యసభ మార్షల్స్ కు కొత్త డ్రెస్ కోడ్ రానుంది. మొత్తం రూ. 862 కోట్ల వ్యయం అంచనాతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు విలువ రూ. 1200 కోట్లకు చేరుకుంది.
Prime Minister Narendra Modi will dedicate the newly constructed Parliament building to the Nation on 28 May, 2023.
Lok Sabha Speaker Om Birla met Prime Minister Narendra Modi on Thursday and invited him to inaugurate the New Parliament Building. Construction of the New… pic.twitter.com/d0kjUsKCQt
— ANI (@ANI) May 18, 2023
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!