PM Modi: కాంగ్రెస్కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
- కాంగ్రెస్ విద్వేష రాజకీయాలను రెచ్చగొడుతోంది
- బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలే
- కాంగ్రెస్ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారు : ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్ విద్వేష రాజకీయాలను రెచ్చగొడుతోందని, ఆ పార్టీ MMCగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. MMC అంటే ముస్లిం లీగ్ మావోవాది కాంగ్రెస్ పార్టీ అని మోడీ చెప్పారు. మావోయిస్టులతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన భారీ బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా అంటూ తెలుగులో ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న బెంగాల్కు వెళ్లాను. బెంగాల్లో తొలిసారి బీజేపీ సీఎం ప్రమాణస్వీకారం చేశారు. భారీ మెజార్టీతో బెంగాల్లో బీజేపీ గెలిచింది. బెంగాల్ విజయోత్సవం తెలంగాణలో కనిపిస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, ఆ రాష్ట్రంలో ఎలాంటి ఉత్సాహాన్ని చూశామో, అచ్చం తెలంగాణలో కూడా అదే ఉత్సాహం కనిపిస్తోందని చెప్పారు. బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ, లెఫ్ట్ పార్టీలను తిరస్కరించారని, దాంతో మమత నియంతృత్వం నుంచి బెంగాల్ విముక్తమైందని చెప్పారు. అస్సోంలో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుందని, అలాగే పుదుచ్చేరిలో కూడా NDA రెండోసారి అధికారంలోకి వచ్చిందన్నారు.
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
ఇప్పుడు తెలంగాణలో అందరి నోట ఒకటే మాట వినిపిస్తోందని, రాష్ట్రంలో కూడా బీజేపీ సర్కార్ ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి ఏటా దేశంలో ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో కొందరు గెలుస్తారు, కొందరు ఓడుతారు. కానీ ఈ సారి జరుగుతున్న చర్చ ఎప్పుడూ జరగలేదు. బెంగాల్లో బీజేపీ గెలుపుతో బానిస సంకెళ్లు తొలిగాయి. టీఎంసీ తానాషాహీ మోడల్తో ప్రజలను ఇబ్బంది పెట్టింది. బెంగాల్ ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నారు. పదేళ్ల క్రితం బెంగాల్లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉండేవారు. ఇప్పుడు 200 మందికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. మొదట్లో బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారు, అందులో ఒకరు తెలంగాణ వ్యక్తి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలే. దేశంలో 14 ఇండస్ట్రియల్ కారిడార్ల పనులు జరుగుతున్నాయి. అందులో ఒకటి జహీరాబాద్లో ఏర్పాటు చేస్తున్నాం. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ఎక్కడున్నా ఒకటే మోడల్. ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇస్తారు. ఆ తర్వాత సాకులు వెతుకుతారు. తెలంగాణలో కూడా ఇదే జరుగుతోందని విమర్శించారు.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!