PM Modi: కులతత్వ విషాన్ని చిమ్ముతున్న వాళ్లను బీహారీలు తిరస్కరించారు..
- విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడిన ప్రధాని మోడీ..
- కులతత్వ విషాన్ని చిమ్ముతున్న వాళ్లను బీహారీలు తిరస్కరించారు..
- కాంగ్రెస్ పార్టీపై జాతీయ స్థాయి నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు: ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: సూరత్లో స్థిరపడిన బీహారీలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి స్పందిస్తూ.. విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కులతత్వ విషాన్ని చిమ్ముతున్న వారిని, ముస్లిం లీగ్ -మావోయిస్టు భావజాలం కలిగిన వారిని ఇక్కడి ప్రజలు తిరస్కరించారని తెలిపారు. అలాగే, పదేళ్ల నుంచి వరుస ఓటములపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. అంతేకాదు.. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలతో పని చేసిన జాతీయ నాయకులు కూడా ఆ పార్టీ నేత చేసిన విన్యాసాలతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.
Read Also: CSK New Captain 2026: 2026 ఐపీఎల్కు కొత్త కెప్టెన్ను ప్రకటించిన సీఎస్కే యాజమాన్యం..
Also Read
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- IMD Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు
- Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్పై గడ్కరీ..
- Trump-Iran: జోర్డాన్లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
ఇక, మిత్రపక్షాలకు, కార్యకర్తలకు కూడా బీహార్ లో ఓటమి గురించి వివరించే పరిస్థితిలో ఆ పార్టీ నేతలు లేరని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. ఈవీఎంలు, ఎలక్షన్ కమిషన్, ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై నిందలు వేసే సులభమైన మార్గాన్ని కనిపెట్టిందని అన్నారు. అలాగే, కులతత్వ విషాన్ని చిమ్మే వారిని ప్రజలు తిరస్కరిస్తారని చెప్పడానికి బీహార్ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయని వెల్లడించారు. దళితులు అత్యధికంగా ఉన్న 38 స్థానాల్లో 34 సీట్లను ఎన్డీయే కైవసం చేసుకుంది, దళితులు కూడా కాంగ్రెస్ను తిరస్కరించారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్- ఆర్జేడీలతో కూడిన మహాఘఠ్బంధన్ కేవలం 34 సీట్లలో మాత్రమే గెలిచింది, అధికార ఎన్డీయే 202 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో రికార్డు సృష్టించింది అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!