PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..

  • ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట..
  • స్థలాన్ని వదులుకున్న బీజేపీ ఎమ్మెల్యే..
  • తన స్థలాన్ని కబ్జా చేశారని ప్రధాని ఫిర్యాదు..
  • మోడీని కలిసిన తర్వాత దిగివచ్చిన అధికారులు, ఎమ్మెల్యే..
Pm Modi

Pm Modi

PM Modi: ఇటీవల ప్రధాని నరేంద్రమోడీని ఆయన చిన్ననాటి మిత్రుడు అస్గర్ అలీ వోరా కలిశారు. తన భూమిని కబ్జా చేశారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయనను కోరారు. మహారాష్ట్రంలోని మీరా-భయందర్ భూ వివాదానికి సంబంధించి ఇప్పుడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానిని కలిసిన కొన్ని రోజులకే అస్గర్ అలీ వోరాకు సంబంధించిని వివాదాస్పద స్థలాన్ని వదిలుకున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మొహతా ప్రకటించారు.

అస్గర్, ప్రధాని మోడీలు కలిసి వడ్నగర్ బీఎన్ స్కూల్‌లో చదువుకున్నారు. సెప్టెంబర్ 08న ప్రధానిని కలిసి తన గోడు చెప్పారు. భయందర్‌ ఈస్ట్‌లోని తన భూమిని బిల్డర్లు ఆక్రమించారంటూ, ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరారు. 1989లో నవ్‌ఘర్ ప్రాంతంలోని భూమిని కొనుగోలు చేసినట్లు వోరా చెప్పారు. తాను ఎవరికీ ఈ స్థలాన్ని విక్రయించలేదని, నకిలీ పత్రాలతో భూమిని రెండు భాగాలుగా విభజించి, ఇద్దరు బిల్డర్ కంపెనీలు ఆక్రమించినట్లు మోడీకి ఫిర్యాదు చేశారు.

దీని తర్వాత, ఈ విషయాన్ని మీరా-భయందర్ మున్సిపల్ అధికారులు సుమోటోగా తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పరిశీలించారు. మంగళవారం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీకర్ పర్దేశీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో అస్గర్ వోరా, బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా, మీరా-భయందర్ మున్సిపల్ కమిషనర్ రాధా వినోద్ శర్మ, టౌన్ ప్లానర్ పురుషోత్తం షిండే పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్థలంపై యాజమాన్య హక్కుల్ని వదులుకుంటున్నట్లు మెహతా ప్రకటించారు. అలాగే వోరాపై గతంలో ఇచ్చిన పోలీస్ ఫిర్యాదును వాపస్ తీసుకున్నట్లు ప్రకటించారు.