వంద కోట్ల టీకాలు.. భారతీయుల ఐక్యతకు నిదర్శనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకటి కాదు రెండు కాదు.. వంద కోట్ల టీకాలు భారతజాతి ప్రపంచానికి చాటిన ఐక్యతా అంశం. ‘మన్ కీ బాత్’ 82 వ రేడియో ఎడిషన్లో ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్లు ఇవ్వడం భారతదేశ శక్తిని అందరికీ చూపించిందన్నారు మోడీ. కరోనాపై పోరులో ఇదో మైలురాయి అని ప్రధాని మోడీ అన్నారు. వ్యాక్సిన్లు అందరికీ అందిస్తామన్నారు. అసాధ్యం అని భావించిన ఈ విజయం తర్వాత దేశం కొత్త ఉత్సాహంతో.. కొత్త శక్తితో.. ముందుకు సాగుతోందన్నారు.
మనమంతా ఐక్యంగా ఉంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరని అన్నారు. సంస్కృతి, మూలాల గురించి గర్వపడేలా బిర్సా ముండా మనకు నేర్పించారని కొనియాడారు. అలాగే, పోలీసు, భద్రతా దళాల్లో మహిళల సంఖ్య పెరుగుతుండటం చాలా సంతోషకరమైన విషయం అని ప్రధాని మోడీ అన్నారు. కరోనాపై పోరు, టీకా కార్యక్రమాల గురించి మోడీ ప్రస్తావించారు. ఆరోగ్య కార్యకర్తలు అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు.
Also Read
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
- Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Raksha Bandhan 2026: రక్షా బంధన్ 2026 ఎప్పుడు..? రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం.. గ్రహణం ప్రభావం ఉంటుందా?
‘సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మనకు ఐక్యత సందేశాన్ని అందించారు. ఆయన చూపిన మేరకు కార్యాచరణలో మనమందరం తప్పనిసరిగా చేరాలి. యురీ నుంచి పఠాన్కోట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం ద్వారా జమ్ముకశ్మీర్ పోలీసు సిబ్బంది ఐక్యతా సందేశాన్ని ఇచ్చారు.
మన ఐక్యతతోనే దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలమని సర్దార్ చెప్పేవారు. మనలో ఐక్యత లేకపోతే మనం కొత్త విపత్తుల్లో చిక్కుకున్నట్లే భావించాలి’ అన్నారు మోడీ. ప్రధాని మోడీ ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్కు చెందిన మహిళా ఆరోగ్య కార్యకర్త పూనం నౌటియాల్తో మాట్లాడారు. టీకా సమయంలో ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు.
దేశంలో విజయవంతమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిందన్నారు. అక్టోబర్ 31న జరగనున్న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు ప్రధాని. ప్రజలందరూ దేశ ఐక్యతను చాటి చెప్పే విధంగా మంచి పని చేయాలన్నారు.
తాజావార్తలు
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
-
YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!