PM Modi: ప్రభుత్వాలను జైలు నుంచి నడపడమేంటి?.. కొత్త బిల్లుపై మోడీ కీలక వ్యాఖ్యలు
- ప్రభుత్వాలను జైలు నుంచి నడపడమేంటి?
- కొత్త బిల్లుపై మోడీ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడితే 48 గంటలు కస్టడీలో ఉంటే వెంటనే సస్పెండ్కు గురవుతారని.. అలాంటిది ఒక ముఖ్యమంత్రి గానీ.. ఒక మంత్రి గానీ.. ఒక ప్రధానమంత్రి గానీ జైల్లో ఉంటే వారెందుకు అధికారం అనుభవిస్తున్నారని మోడీ ప్రశ్నించారు. ఇది ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ప్రధాని మోడీ గయలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కళంక మంత్రులను తొలగించే బిల్లుపై తొలిసారి స్పందించారు. కళంక మంత్రులు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడమేంటి? అని మోడీ ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Putin: ఆ 3 కండీషన్స్ ఒప్పుకుంటేనే శాంతి చర్చలు.. తేల్చి చెప్పిన పుతిన్!
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
అవినీతిపై పోరాటం ముగింపు దిశకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఇందులో ప్రధాని గానీ.. ముఖ్యమంత్రి గానీ, మంత్రిగానీ మినహాయింపు ఉండకూడదన్నారు. ఇటీవల జైలుకెళ్లిన వారు ఫైళ్లపై ఎలా సంతాలు చేశారో మనమంతా చూశామని గుర్తుచేశారు. ఇకపై ఇలా జరగకూడదనే కళంక మంత్రులను తొలగించే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Tej Pratap Yadav: నా నాశనానికి 5 కుటుంబాలు కుట్రపన్నాయి.. లాలూ కుమారుడు ఆరోపణలు
తీవ్రమైన నేరాలకు పాల్పడి 30 రోజుల్లో జైల్లో ఉంటే ప్రధానమంత్రిగానీ.. ముఖ్యమంత్రిగానీ తొలగించే బిల్లును పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విపక్ష నాయకులను బలహీన పరిచేందుకే ఈ బిల్లు తీసుకొస్తున్నట్లు తప్పుపట్టాయి. లిక్కర్ స్కామ్లో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. జైలు నుంచి 6 నెలల పాటు పరిపాలించారు. తాజాగా ఆ విషయాన్ని మోడీ బీహార్లో పరోక్షంగా ప్రస్తావించారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!