PM Modi: సీపీ.రాధాకృష్ణన్ ప్రజా సేవకే జీవితం అంకితం చేశారు.. చైర్మన్ను అభినందించిన మోడీ
- పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
- రాజ్యసభ చైర్మన్ సీపీ.రాధాకృష్ణన్ను అభినందించిన మోడీ
- వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా మహిళలకు మోడీ అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇక రాజ్యసభకు తొలిసారి సీపీ రాధాకృష్ణన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా అన్ని పార్టీలు ఆయన్ను అభినందించాయి. ఇక ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఇటీవల వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా మహిళలకు మోడీ అభినందనలు తెలిపారు. ‘‘పెద్దల సభా గౌరవాన్ని సభ్యులు గౌరవించాలి. సీపీ.రాధాకృష్ణన్ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు. రాధాకృష్ణన్ ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్ గవర్నర్గా పని చేశారు. అర్థవంతమైన చర్చలు జరిగితే సభకు సార్థకత వస్తుంది.’’ అని మోడీ తెలిపారు.
ఇది కూడా చదవండి: Trump-Maduro: వెనిజులా అధ్యక్షుడితో ట్రంప్ సంభాషణ.. మేటర్ సీరియస్ అవుతోందా?
Also Read
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
గత వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున అనూహ్యంగా ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్ఖర్ రాజీనామా చేశారు. దీంతో ఆయన వారసుడిగా మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సీసీ.రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతిగా కేంద్రం ఎన్నిక చేసింది. తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున రాజ్యసభ ఛైర్మన్గా రాధాకృష్ణన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అందరూ ఆయన్ను అభినందించారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి పరుగులు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
ఇదిలా ఉంటే పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మోడీ మీడియాతో మాట్లాడారు.
‘‘ఓటమి నిరాశకు పార్లమెంట్ యుద్ధభూమి కాదు’’ అని పేర్కొన్నారు. సమావేశాలు ప్రారంభం అవుతున్న తరుణంలో ప్రధాని మోడీ కీలక ఉపాన్యాసం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని కోరారు. ఓటమి నిరాశకు యుద్ధభూమి కాదని.. మనం సమతుల్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని.. చట్టసభల్లో సమయానికి చర్చలు తప్పనిసరి అని తెలిపారు. దేశ ప్రగతి కోసం పార్లమెంట్లో మంచి చర్చలు కొనసాగాలని ఆకాంక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దేశాభివృద్ధి కోసం విపక్షాలు కూడా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
#WATCH | Delhi: In Rajya Sabha, PM Narendra Modi says, "You (CP Radhakrishnan) were born in Dollar City, and it has its own identity. Despite this, you chose 'Antyodaya' as your field of service. You always cared for the oppressed, downtrodden, and marginalised families, even… pic.twitter.com/F6Zaef9ydf
— ANI (@ANI) December 1, 2025
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!