PM Modi: శ్రీలంకకు చేరుకున్న ప్రధాని మోడీ.. ద్వీప దేశంలో 3 రోజుల పర్యటన..
- శ్రీలంక చేరుకున్న ప్రధాని మోడీ..
- ద్వీప దేశంలో 3 రోజుల పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్రమోడీ శ్రీలంక చేరుకున్నారు. శుక్రవారం కొలంబోలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారత్, శ్రీలంక మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. రక్షణ, ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, వాణిజ్య రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. గతేడాది వామపక్ష కూటమికి చెందిన అనుర కుమార దిస్సనాయకే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారిగా శ్రీలంకలో పర్యటిస్తున్నారు.
Read Also: Off The Record : కేతిరెడ్డి నెంబర్ వచ్చిందా..Farm House కోసం 20 ఎకరాల చెరువును మింగేశారా ?
Also Read
- Kumkum Bhagya: ప్రముఖ యువ నటి సంచితా ఉగలే అనుమానాస్పద మృతి!
- Explainer: ఎల్నినో ఎఫెక్ట్.. రైతులకు డబుల్ షాక్.. నిత్యావసర ధరలు పెరుగుతాయా?
- Pawan Kalyan: తెలంగాణ ఏర్పాటును నేను వ్యతిరేకించలేదు.. కాంగ్రెస్ తీరు ఇప్పటికీ మారలేదు!
- India Monsoon Rainfall Deficit: మాయమైన రుతుపవనాలు.. ఉపగ్రహ చిత్రాల్లో ఆందోళనకర దృశ్యాలు
థాయ్లాండ్లో జరిగిన బిమ్స్టెక్ సమావేశం అనంతరం ప్రధాని మోడీ నేరుగా శ్రీలంక చేరుకున్నారు. గత డిసెంబర్ లో దిస్సనాయకే న్యూఢిల్లీ పర్యటకు వచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి విదేశీ పర్యటన భారత పర్యటన. ప్రధాని మోడీ పర్యనటలో 8 అవగాహన ఒప్పందాలపై సంతకం చేయాలని భావిస్తున్నారు. ద్వీప దేశానికి చౌకైన ఇంధన సరఫరాతో సహా ఆరోగ్యం, రక్షణ, ఇంధన రంగాల్లో సహకరించేలా ఈ ఒప్పందాలు ఉండబోతున్నాయి.
ఈ పర్యటనకు ప్రధాని మోడీతో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఉన్నారు. శనివారం ప్రధాని మోడీ కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్లో గౌరవ వందనం స్వీకరించనున్నారు, ఆ తర్వాత అధ్యక్ష సచివాలయంలో అధ్యక్షుడు దిస్సనాయకేతో అధికారిక చర్చలు జరుగుతాయి.
తాజావార్తలు
-
Kumkum Bhagya: ప్రముఖ యువ నటి సంచితా ఉగలే అనుమానాస్పద మృతి!
-
TPCC Mahesh Goud: పవన్ కళ్యాణ్పై మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
-
Tollywood Focus: హీరోలకంటే డైరెక్టర్లకే క్రేజ్ ఎక్కువ.. కానీ?
-
Explainer: ఎల్నినో ఎఫెక్ట్.. రైతులకు డబుల్ షాక్.. నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Ban Social Media for Children Under 16: అక్కడ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ప్రధాని సంచలన ప్రకటన
ట్రెండింగ్
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!