Delhi: మహిళ కిడ్నాప్, సామూహిక అత్యాచారం.. నిర్భయ తరహాలో చిత్రహింస
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical assault on woman in Delhi:ఢిల్లీలో మృగాళ్లు దారుణానికి తెగబడ్డారు. ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మహిళపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరోసారి ఢిల్లీ నిర్భయ ఘటనను గుర్తు చేసే విధంగా ప్రవర్తించారు. మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు వ్యక్తులు. తీవ్ర గాయాలపాలైన సదరు బాధిత మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషనర్ సీరియస్ అయ్యారు. అధికారుల నుంచి వివరాలు కోరారు. తీవ్రగాయాల పాలైన మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
శాటిలైట్ టౌన్, ఢిల్లీని కలిపే మార్గంలో పడి ఉన్న మహిళను పోలీసులు మంగళవారం ఆస్పత్రికి తరలించారు. బాధిత మహిళ చెప్పిన వివరాల ప్రకారం ఘజియాబాద్ లో బర్త్ డే పార్టీ ముగించుకుని ఢిల్లీకి వెళ్తున్న మహిళను ఆమె సోదరుడు బస్టాండ్ లో దింపేశాడు. ఆమె బస్సు కోసం వేచి చూస్తుండగా.. ఒక కారు ఆమె దగ్గరకు వచ్చి ఆగింది. అందులో ఉన్న ఐదుగురు వ్యక్తులు మహిళను కారులోకి బలవంతంగా ఎక్కించుకుని వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Also Read
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- PM Modi: జేడీ వాన్స్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
2 రోజుల పాటు మహిళపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రైవేటు భాగాల్లోకి రాడ్ చొప్పించారు. ప్రస్తుతం బాధిత మహిళ ప్రాణాల కోసం పోరాడుతోంది. ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాతి మలివాల్ నిందితుల వివరాలను కోరుతూ.. నోటీసులు జారీ చేశారు. మహిళ రక్తపు మడుగులో ఉందని.. ఆమె శరీరంలో ఇనుప రాడ్ ఉందని..ఆమె పరిస్థితి విషమంగా ఉందని పంపిన నోటీసుల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే బాధితురాలు, నిందితులకు మధ్య ఆస్తి తగాదా ఉందని.. విషయం కోర్టు పరిధిలో ఉందని.. మేము అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఘజియాబాద్ పోలీస్ సూపరింటెండెంట్ నిపున్ అగర్వాల్ తెలిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
-
Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
-
Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
-
TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
-
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!