Jharkhand: బైక్ రైడ్కు వెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజనీర్పై సామూహిక అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical assault on software engineer in jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన స్నేహితుడితో కలిసి మాట్లాడుతున్న సమయంలో ఓ యువతిని అపహరించి 10 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. ఈ కేసులో 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. నిందితులను పట్టుకునేందు పోలీసుదుల దాడులు నిర్వహిస్తున్నారు.
జార్ఖండ్ రాష్ట్రంలోని 26 ఏళ్ల గిరిజన యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన అక్టోబర్ 20న చైబాసాప్రాంతంలో చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి, వర్క్ ఫ్రం హోం కావడంతో ఇంటి నుంచే ఉద్యోగాన్ని చేస్తోంది. జింక్ సాని నివాసి అయిన యువతి చైబాసాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమర్హటులో అద్దె ఇంట్లో నివసిస్తోంది. రెండు రోజుల క్రితం తన స్నేహితుడితో కలిసి చైబాసా ఎయిర్ స్ట్రిప్ సందర్శించేందుకు వెళ్లింది. గురువారం సాయంత్రం స్కూటీ రైడ్ కోసం టెక్రాహటు ఎయిర్ స్ట్రిప్ కు చేరుకున్నారు. అయితే అక్కడ యువతి, తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. 10 మంది యువకులు వచ్చి ఇద్దరిని బెదిరించి దాడికి పాల్పడ్డారు. రూ.5000 వేలు, సెల్ ఫోన్లను తీసుకుని నిందితులు పరారయ్యారు.
Also Read
- Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
- Rahul Gandhi on NEET Paper Leak: "యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే".. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
Read Also: China: నేటితో ముగియనున్న కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు.. మూడోసారి అధ్యక్షుడిగా జిన్ పింగ్..!
అక్కడ నుంచి యువతిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన యువతిన చైబాసా ఆస్పత్రిలో చేర్పించారు. యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో నిందితులు ఆమెను అక్కడే వదిలిపారిపోయారు. అక్కడి నుంచి తప్పించుకున్న యువతి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ విషయం గురువారం రాత్రి పోలీసులకు తెలియడంతో డీఎస్పీ దిలీప్ ఖల్కో, ముఫాసిల్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ పవన్ పాఠక్ ఘటన స్థలానికి చేరుకుని నిందితుల కోసం వేటను ప్రారంభించాయి. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకులను అరెస్ట్ చేసి అందర్ని విచారిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు జార్ఖండ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం యువతిని సదర్ ఆస్పత్రిలో పోలీసుల పర్యవేక్షణలో ఉంచారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పలువురిని విచారిస్తున్నామని ఎస్పీ అశుతోష్ శేఖర్ తెలిపారు.
Jharkhand | A case of gang rape with a software engineer has been reported in Chaibasa on October 20. Police have registered the FIR against 10 accused. SIT has been formed to probe the case. Raids are being conducted to arrest the accused: Chaibasa Police
— ANI (@ANI) October 22, 2022
తాజావార్తలు
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
-
Objection My Lord Trailer : మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్ విడుదల
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
ట్రెండింగ్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!