Chhattisgarh: ఆస్పత్రిలో నర్సును కట్టేసి గ్యాంగ్ రేప్.. నిందితుల్లో మైనర్
physical assault on nurse In Chhattisgarh: మరో మహిళపై అత్యాచారం జరిగింది. దేశంలో ప్రతీ రోజూ ఎక్కడో ఓ చోట ఆడవాళ్లపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్లో దారుణం జరిగింది. ఓ ఆరోగ్య కేంద్రంలోనే నర్సపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. నలుగురు వ్యక్తులు నర్సును కట్టేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్దారు. నిందితుల్లో 17 ఏళ్ల మైనర్ కూడా ఉన్నాడు. ఈ ఘటనలో మైనర్ తో సహా ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నాడు. పోలీసులు నాలుగో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నలుగురు నిందితులు అత్యాచారం చేసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇస్తే చంపేస్తామని బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Also: Says Satyavathi Rathod: కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యేవరకు చెప్పులు వేసుకోను
Also Read
- High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
మహేంద్రగఢ్ జిల్లాలోని చిప్చిలి గ్రామంలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆరోగ్య కేంద్రంలో నర్సు ఒంటరిగా ఉండటాన్ని నలుగురు గమనించి అత్యాచారం చేయాలని భావించారు. ఈ క్రమంలో ఆరోగ్య కేంద్రంలోకి వెళ్లిన నిందితులు ఒంటరిగా ఉన్న నర్సును కట్టేసి, గొంతును బిగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న నర్సు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదు మేరకు ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సీఎం భూపేష్ భగేల్ నేతృత్వంలోని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మహిళలకు రక్షణ ఇవ్వడం లేదని బీజేపీ విమర్శించింది. ఈ ఘటనలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ఆరోగ్య కార్యకర్తల సిబ్బందికి ప్రభుత్వం రక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాకు రక్షణ కావాలని.. నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని.. అప్పటి వరకు మేం పని చేయమని చీఫ్ హెల్త్ ఆఫీసర్ ప్రతిమా సింగ్ అన్నారు.
అంతకుముందు జార్ఖండ్ రాష్ట్రంలో ఇలాగే ఓ యువతిపై 10 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బైక్ రైడ్ కోసం సరదాగా స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలిని, అతని స్నేహితుడిని కొట్టి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసుపై జార్ఖండ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభించారు.
తాజావార్తలు
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
-
High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
-
KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
-
Iran: ఉరిశిక్షలతో హడలెత్తిస్తున్న ఇరాన్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!