Satyavathi Rathod: కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యేవరకు చెప్పులు వేసుకోను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satyavathi Rathod: తెలంగాణలో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల వేడి రాజుకుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు మునుగోడులో మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నాయి. గెలుపే ధ్యేయంగా అన్ని పార్టీలు పోరు సాగిస్తున్నాయి. ఈ మునుగోడు పోటీలో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఇక, అధికార టీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో మంత్రులంతా మొగ్గు చూపుతూ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న శనివారం మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ప్రచార బరిలోకి దిగారు. భువనగిరి జిల్లా రాధానగర్ తండాలో మంత్రి చెప్పులు లేకుండా ప్రచారం నిర్వహించారు. అయితే ఆమె చెప్పులు లేకుండా ప్రచారం చేయడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. దాని గురించి ఆమె వివరణ ఇస్తూ.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు పాదరకలు ధరించనని చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి దీక్ష చేపట్టామని.. గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.
Read also: Ind Vs Pak: పాకిస్థాన్ హ్యాట్రిక్ కొడుతుందా? టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
6 శాతం రిజర్వేషన్లను 10 శాతానికి పెంచారని గుర్తు చేశారు. వారి కోసం గిరిజన బంధు పథకం కూడా ప్రవేశపెట్టామన్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారన్న సత్యవతి రాథోడ్ మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు చెప్పులు వేసుకోనని స్పష్టం చేశారు. ఆయన మళ్లీ ముఖ్య మంత్రి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లాలని అన్నారు. కేసీఆర్ పథకాలు ప్రతి ఒక్క రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశ్యంతోనే చెప్పులు వేసుకోలేదని ఎప్పుడైతే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారో అప్పుడే ధరిస్తానని తేల్చిచెప్పేసారు. అయితే ఆమె చెప్పులు లేకుండా మునుగోడు ప్రచారంలో పాల్గొనడం అందరి దృష్టి ఆకర్షిస్తోంది.
Vijayawada: దీపావళి ముందు రోజే విజయవాడలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!