Tamil Nadu: మైనర్ బాలికపై లైంగిక దాడి.. మత్తు మందు ఇచ్చి బ్లాక్మెయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical assault on minor girl in Tamil nadu: తమిళనాడులో ఘోరం జరిగింది. మైనర్ బాలికపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు ఐదుగురు దుర్మార్గులు. సామూహిక లైంగికదాడికి పాల్పడటంతో పాటు బ్లాక్ మెయిల్ చేస్తూ బాలికకు నరకం చూపించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో తిరుచ్చిలో జరిగింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడేలా చేసింది ఆమెకు బంధువే. బంధువుతో పాటు మరో నలుగురు వ్యక్తులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Also Read
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
వివరాల్లోకి వెళితే.. 16 ఏళ్ల బాలికకు మత్తుమందు ఇచ్చి ఆమె బంధువుతో పాటు మరో నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక సంవత్సరం పాటు ఈ అఘాయిత్యానికి సంబంధించి వీడియోను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 2021 ఏప్రిల్ నెలలో మైనర్ బాలిక బంధువుల అయిన రంగనాథ్ బైకుపై ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు మత్తుమందు ఇచ్చాడు. రంగనాథ్ బాలికపై లైంగికదాడికి పాల్పడి దాన్ని ఆ ఫోన్ లో రికార్డ్ చేసి, తన నలుగురు స్నేహితులకు ఫోన్ చేశాడు. ఈ వీడియోను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ.. నలుగురు పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
అయితే అమ్మాయి ప్రవర్తన చూసిన తల్లిదండ్రులు ఇటీవల తిరుచ్చిలోని ఓ వ్యక్తితో వివాహం జరిపించారు. అయితే బాలల హక్కుల సంఘం ఈ విషయం తెలియడంతో ముసిరి పోలీసులకు సమాచారం అందించి బాలికలను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ క్రమంలో వాట్సాప్ లో లైంగిక వేధింపుల వీడియో వైరల్ గా మారింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ముసిరి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగనాథ్ స్నేహితుల్లో ఒకరు ఈ వీడియోను వాట్సాప్ లో షేర్ చేయడంతో రంగనాథ్, అతని స్నేహితులకు మధ్య గొడవ జరిగిందని విచారణలో తేలింది. బాలిక ఫిర్యాదు మేరు రంగనాథన్, మణికందన్, గణేష్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
-
Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
-
Trivikram: త్రివిక్రమ్తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!