Petrol Price: టెన్షన్ పెడుతోన్న తాజా నివేదిక.. రూ.15-22 పెరగనున్న పెట్రో ధరలు..!
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇప్పుడు అన్ని దేశాలను టెన్షన్ పెడుతోంది.. యుద్ధం కంటే ముందుగానే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు క్రమంగా పైపైకి కదిలాయి.. దానికి యుద్ధం తోడు కావడంతో.. రికార్డు ధరలను తాకుతున్నాయి… అయితే, అంతర్జాతీయ పరిస్థితులకు తోడు, ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం భారత్పై తీవ్రంగా పడుతోంది… ఇప్పటికే వంటనూనెల ధరలు, స్టీల్ వంటి ధరలు పెరుగుతాయనే విశ్లేషలు చెబుతుండగా.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందంటూ తాజాగా ఓ నివేదిక పేర్కొనడం.. సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు 125 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్న ఆ నివేదిక, అదే జరిగితే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు ఏకంగా రూ.15 నుంచి రూ.22 వరకు పెరుగుతాయని అంచనా వేసింది.
Read Also: Russia-Ukraine conflict: భారీగా పెరగనున్న ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
అయితే, క్రమంగా పెరుగుతూ భారత్లో రికార్డు స్థాయిని తాకాయి పెట్రో ధరలు.. కానీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు వాటిపై పన్నులు తగ్గిస్తున్నట్టు ప్రకటించి ఉపశమనం కలిగించిన కేంద్ర ప్రభుత్వం.. ఇక, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలు జోలికి మాత్రం పోవడం లేదు.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు క్రమంగా పైకి కదులుతున్నా.. వాటి ధరలను సవరించే ధైర్యం మాత్రం చేయలేదు.. కానీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 7వ తేదీన ముగియనున్నాయి.. 10వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.. అయితే, పోలింగ్ ముగిసిన రోజే లేదా ఆ తర్వాత రోజే పెట్రో బాంబ్ పేలడం ఖాయమని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. పెట్రో ఉత్పత్తులకు అవసరమైన క్రూడాయిల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటుంది భారత్.. దీంతో, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పెంపు భారత ఆర్థికవ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది అంటున్నారు. ఇటీవల, సంక్షోభం మరియు తక్కువ సరఫరాల భయాలు బ్రెంట్ ముడి చమురు ధరను 10 సంవత్సరాల గరిష్ట స్థాయికి దాదాపు బ్యారెల్కు 120 డాలర్లకు చేరాయి.. ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతాయని.. భారత్లో పెట్రో మంట మండబోతోంది అంటూ వెలువడిని తాజా రిపోర్టులు ఇప్పుడు సామాన్యులకు గుబులుపుట్టిస్తున్నాయి.
- Tags
తాజావార్తలు
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!