Petrol Price: టెన్షన్ పెడుతోన్న తాజా నివేదిక.. రూ.15-22 పెరగనున్న పెట్రో ధరలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇప్పుడు అన్ని దేశాలను టెన్షన్ పెడుతోంది.. యుద్ధం కంటే ముందుగానే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు క్రమంగా పైపైకి కదిలాయి.. దానికి యుద్ధం తోడు కావడంతో.. రికార్డు ధరలను తాకుతున్నాయి… అయితే, అంతర్జాతీయ పరిస్థితులకు తోడు, ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం భారత్పై తీవ్రంగా పడుతోంది… ఇప్పటికే వంటనూనెల ధరలు, స్టీల్ వంటి ధరలు పెరుగుతాయనే విశ్లేషలు చెబుతుండగా.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందంటూ తాజాగా ఓ నివేదిక పేర్కొనడం.. సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు 125 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్న ఆ నివేదిక, అదే జరిగితే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు ఏకంగా రూ.15 నుంచి రూ.22 వరకు పెరుగుతాయని అంచనా వేసింది.
Read Also: Russia-Ukraine conflict: భారీగా పెరగనున్న ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు
Also Read
- K Pajanivel: పద్మశ్రీ పురస్కారం స్వీకరించే ముందు.. ప్రధాని మోడీకి సాష్టాంగ నమస్కారం.. కె. పజనివేల్ ఎవరు?
- Tamil Nadu: ఇదేం పద్ధతి? బాలిక హత్య కేసు ప్రెస్మీట్లో పోలీసులు వెకిలి నవ్వులు.. వీడియో వైరల్
- CM Vijay: సింహాసనం విజయ్ది.. వ్యూహం కాంగ్రెస్ది.. నట్టేట మునిగిన ఏఐఏడీఎంకే రెబల్స్..!
- TMC crisis: టీఎంసీ సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేల డుమ్మా.. మమతా పార్టీలో ముదురుతున్న అంతర్గత సంక్షోభం!
అయితే, క్రమంగా పెరుగుతూ భారత్లో రికార్డు స్థాయిని తాకాయి పెట్రో ధరలు.. కానీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు వాటిపై పన్నులు తగ్గిస్తున్నట్టు ప్రకటించి ఉపశమనం కలిగించిన కేంద్ర ప్రభుత్వం.. ఇక, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలు జోలికి మాత్రం పోవడం లేదు.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు క్రమంగా పైకి కదులుతున్నా.. వాటి ధరలను సవరించే ధైర్యం మాత్రం చేయలేదు.. కానీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 7వ తేదీన ముగియనున్నాయి.. 10వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.. అయితే, పోలింగ్ ముగిసిన రోజే లేదా ఆ తర్వాత రోజే పెట్రో బాంబ్ పేలడం ఖాయమని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. పెట్రో ఉత్పత్తులకు అవసరమైన క్రూడాయిల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటుంది భారత్.. దీంతో, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పెంపు భారత ఆర్థికవ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది అంటున్నారు. ఇటీవల, సంక్షోభం మరియు తక్కువ సరఫరాల భయాలు బ్రెంట్ ముడి చమురు ధరను 10 సంవత్సరాల గరిష్ట స్థాయికి దాదాపు బ్యారెల్కు 120 డాలర్లకు చేరాయి.. ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతాయని.. భారత్లో పెట్రో మంట మండబోతోంది అంటూ వెలువడిని తాజా రిపోర్టులు ఇప్పుడు సామాన్యులకు గుబులుపుట్టిస్తున్నాయి.
- Tags
తాజావార్తలు
-
OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
-
Zepto: దలాల్ స్ట్రీట్లో క్విక్ కామర్స్ జాతర.. రూ.11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో రెడీ!
-
Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
-
K Pajanivel: పద్మశ్రీ పురస్కారం స్వీకరించే ముందు.. ప్రధాని మోడీకి సాష్టాంగ నమస్కారం.. కె. పజనివేల్ ఎవరు?
-
OTR : ఏపీ రాజకీయాల్లో లెటర్ వార్.. పవన్ కల్యాణ్ కు బొత్స సంచలన లేఖ..?
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?