Petrol Price: టెన్షన్ పెడుతోన్న తాజా నివేదిక.. రూ.15-22 పెరగనున్న పెట్రో ధరలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇప్పుడు అన్ని దేశాలను టెన్షన్ పెడుతోంది.. యుద్ధం కంటే ముందుగానే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు క్రమంగా పైపైకి కదిలాయి.. దానికి యుద్ధం తోడు కావడంతో.. రికార్డు ధరలను తాకుతున్నాయి… అయితే, అంతర్జాతీయ పరిస్థితులకు తోడు, ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం భారత్పై తీవ్రంగా పడుతోంది… ఇప్పటికే వంటనూనెల ధరలు, స్టీల్ వంటి ధరలు పెరుగుతాయనే విశ్లేషలు చెబుతుండగా.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందంటూ తాజాగా ఓ నివేదిక పేర్కొనడం.. సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు 125 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్న ఆ నివేదిక, అదే జరిగితే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు ఏకంగా రూ.15 నుంచి రూ.22 వరకు పెరుగుతాయని అంచనా వేసింది.
Read Also: Russia-Ukraine conflict: భారీగా పెరగనున్న ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు
Also Read
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
అయితే, క్రమంగా పెరుగుతూ భారత్లో రికార్డు స్థాయిని తాకాయి పెట్రో ధరలు.. కానీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు వాటిపై పన్నులు తగ్గిస్తున్నట్టు ప్రకటించి ఉపశమనం కలిగించిన కేంద్ర ప్రభుత్వం.. ఇక, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలు జోలికి మాత్రం పోవడం లేదు.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు క్రమంగా పైకి కదులుతున్నా.. వాటి ధరలను సవరించే ధైర్యం మాత్రం చేయలేదు.. కానీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 7వ తేదీన ముగియనున్నాయి.. 10వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.. అయితే, పోలింగ్ ముగిసిన రోజే లేదా ఆ తర్వాత రోజే పెట్రో బాంబ్ పేలడం ఖాయమని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. పెట్రో ఉత్పత్తులకు అవసరమైన క్రూడాయిల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటుంది భారత్.. దీంతో, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పెంపు భారత ఆర్థికవ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది అంటున్నారు. ఇటీవల, సంక్షోభం మరియు తక్కువ సరఫరాల భయాలు బ్రెంట్ ముడి చమురు ధరను 10 సంవత్సరాల గరిష్ట స్థాయికి దాదాపు బ్యారెల్కు 120 డాలర్లకు చేరాయి.. ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతాయని.. భారత్లో పెట్రో మంట మండబోతోంది అంటూ వెలువడిని తాజా రిపోర్టులు ఇప్పుడు సామాన్యులకు గుబులుపుట్టిస్తున్నాయి.
- Tags
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!