Jagdeep Dhankhar: రాజ్యాంగ పదవిలో ఉండీ ఆర్థిక వ్యవస్థ నాశనానికి ప్రయత్నం.. రాహుల్ గాంధీని ఉద్దేశించేనా..?
- రాజ్యాంగ పదవిలో ఉండీ ఆర్థిక వ్యవస్థ నాశనానికి ప్రయత్నం..
- హిండెన్బర్గ్ నివేదిక గురించి ఉప రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు..
- పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagdeep Dhankhar: భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకు ‘‘రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి’’ ప్రయత్నిస్తున్నారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికపై రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యల గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సెబీ చీఫ్ మాధబి పూరి బుచ్ని లక్ష్యంగా చేసుకుని ఇటీవల హిండెన్బర్గ్ ఓ రిపోర్టుని విడుదల చేసింది. ఆమెకు అదానీ గ్రూపులో షేర్స్ ఉన్నాయని ఆరోపించింది.అయితే, ఈ ఆరోపణల్ని సదరు కంపెనీ తిప్పికొట్టింది. బీజేపీ నేతలు కూడా ఈ రిపోర్టును కొట్టిపారేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేందుకు కొందరు విదేశీ శక్తులతో చేతులు కలిపి పనిచేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.
Read Also: Ricky Ponting: కోహ్లీ కాదు.. సచిన్ ప్రపంచ రికార్డు అతడే బద్దలు కొడతాడు: పాంటింగ్
Also Read
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
శుక్రవారం నేషనల్ లా యూనివర్శిటీ (ఎన్ఎల్యు)లో న్యాయ విద్యార్థులను ఉద్దేశించి ధన్ఖర్ మాట్లాడుతూ, భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ఒక కథనాన్ని తీసుకువచ్చారని దీని గురించి తాను చాలా ఆందోళన చెందుతున్నానని అన్నారు. “గత వారంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి బాగా ప్రచారం పొందిన మీడియాలో ప్రకటించినప్పుడు నేను చాలా ఆందోళన చెందాను. మన ఆర్థిక వ్యవస్థ నాశనం చేసే కథనానికి మద్దతు ఇస్తూ, సుప్రీంకోర్టు సుమోటోగా విచారించాలని అభ్యర్థించిన సమయంలో నేను చాలా ఆందోళన చెందాను’’ అని ధన్ఖర్ అన్నారు.
దేశ శ్రేయస్సు కంటే పక్షపాతం మరియు స్వప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే శక్తులను తుదముట్టించాలని ఆయన యువతను కోరారు. మన దేశం కంటే పక్షపాత్రం, స్వప్రయోజనాలు ఎక్కువగా భావించే శక్తుల్ని తిప్పికొట్టాలని సూచించారు. గతంలో హిండెన్ బర్గ్ నివేదికను ప్రస్తావిస్తూ ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని రాహుల్ గాంధీ కోరాడు. రాహుల్ గాంధీ పేరుని తీయకుండా ధన్ఖర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!