Parliament Sessions: కొవిడ్ నిబంధనల మధ్య వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జులై 18న ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొవిడ్ నిబంధనల మధ్య జరగనున్నాయి. తదుపరి వర్షాకాల సమావేశాలు కూడా సామాజిక దూరం, భద్రతా నిబంధనలకు అనుగుణంగా కొవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం జరుగుతాయని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు చెప్పారు. శుక్రవారం నాడు 18వేలకు పైగా కేసులు నమోదు కాగా.. దేశవ్యాప్తంగా ఇంకా పెరుగుతూనే ఉన్నాయని.. ఈ నేపథ్యంలో గత కొన్ని సెషన్లుగా అమలులో ఉన్న కొవిడ్ ఆంక్షలు రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో కూడా కొనసాగుతాయన్నారు. లోక్సభతో పాటు రాజ్యసభకు చెందిన ఇరువురు సంరక్షకులు గణనీయమైన చర్చలు జరిపి, పర్యవేక్షించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి.
పార్లమెంటు సభ్యులు ఎల్లవేళలా మాస్క్లు ధరించి, భౌతిక దూరం నిబంధనలు కట్టుబడి ఉండాలని భావిస్తున్నారు. సభ్యుల సిట్టింగ్ లోక్సభతో పాటు రాజ్యసభ ఛాంబర్లలో, సందర్శకుల గ్యాలరీలో కూడా అందుబాటులో ఉంటుంది. రాబోయే సెషన్లో సందర్శకుల ప్రవేశం ఉండదని దీని అర్థం. గ్యాలరీల నుంచి సభా కార్యక్రమాలకు హాజరయ్యే మీడియా సిబ్బందిపై కూడా ఆంక్షలు కొనసాగుతాయి. రాజ్యసభ ఛాంబర్లో 60 మంది సభ్యులు, లోక్సభ ఛాంబర్లో 132 మంది కూర్చోవచ్చు. మిగిలిన సభ్యులకు ఉభయ సభల సందర్శకుల గ్యాలరీలో వసతి కల్పిస్తారు. ఎంపీ సిబ్బందిపై ఆంక్షలు, మంత్రులు పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు సిబ్బందిపై పరిమితి ఉండే అవకాశం ఉంది.
Also Read
Red Alert: హైదరాబాద్కు రెడ్ అలెర్ట్ జారీ.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
అర్హులైన వారు, ఇంకా బూస్టర్ డోస్ తీసుకోని వారు టీకా వేయించుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు డెస్క్లు ఏర్పాటు చేయనున్నారు. కాగితపు వినియోగాన్ని, పేపర్ బిల్లుల సర్క్యులేషన్ను నియంత్రించాలని సభ్యులకు విజ్ఞప్తి చేయనున్నట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. 2021లో చివరి వర్షాకాల సమావేశాల్లో తొలిసారిగా పార్లమెంట్లో కొవిడ్ ఆంక్షలు విధించారు.వాస్తవానికి, డిసెంబర్ 2021లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు రద్దు చేయబడ్డాయి. అనంతరం 2022 బడ్జెట్ సమావేశాలతో కలిపి వాటిని నిర్వహించారు. సమావేశాలు జులై18న ప్రారంభమై.. ఆగస్టు 12న ముగుస్తాయి. రాష్ట్రపతి, ఉపాధ్యక్ష ఎన్నికలతో పాటు ఈ సెషన్ కూడా జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికలకు జూలై 18న ఓటింగ్ జరగాల్సి ఉండగా, అవసరమైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు
తాజావార్తలు
-
Cannes 2026: కేన్స్ ఫెస్టివల్లో దేశీ గ్లామర్ షో.. ఖర్చులు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!
-
Ali : అలీ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభం!
-
NBK – Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య’ డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..