Parliament Sessions: కొవిడ్ నిబంధనల మధ్య వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జులై 18న ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొవిడ్ నిబంధనల మధ్య జరగనున్నాయి. తదుపరి వర్షాకాల సమావేశాలు కూడా సామాజిక దూరం, భద్రతా నిబంధనలకు అనుగుణంగా కొవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం జరుగుతాయని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు చెప్పారు. శుక్రవారం నాడు 18వేలకు పైగా కేసులు నమోదు కాగా.. దేశవ్యాప్తంగా ఇంకా పెరుగుతూనే ఉన్నాయని.. ఈ నేపథ్యంలో గత కొన్ని సెషన్లుగా అమలులో ఉన్న కొవిడ్ ఆంక్షలు రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో కూడా కొనసాగుతాయన్నారు. లోక్సభతో పాటు రాజ్యసభకు చెందిన ఇరువురు సంరక్షకులు గణనీయమైన చర్చలు జరిపి, పర్యవేక్షించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి.
పార్లమెంటు సభ్యులు ఎల్లవేళలా మాస్క్లు ధరించి, భౌతిక దూరం నిబంధనలు కట్టుబడి ఉండాలని భావిస్తున్నారు. సభ్యుల సిట్టింగ్ లోక్సభతో పాటు రాజ్యసభ ఛాంబర్లలో, సందర్శకుల గ్యాలరీలో కూడా అందుబాటులో ఉంటుంది. రాబోయే సెషన్లో సందర్శకుల ప్రవేశం ఉండదని దీని అర్థం. గ్యాలరీల నుంచి సభా కార్యక్రమాలకు హాజరయ్యే మీడియా సిబ్బందిపై కూడా ఆంక్షలు కొనసాగుతాయి. రాజ్యసభ ఛాంబర్లో 60 మంది సభ్యులు, లోక్సభ ఛాంబర్లో 132 మంది కూర్చోవచ్చు. మిగిలిన సభ్యులకు ఉభయ సభల సందర్శకుల గ్యాలరీలో వసతి కల్పిస్తారు. ఎంపీ సిబ్బందిపై ఆంక్షలు, మంత్రులు పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు సిబ్బందిపై పరిమితి ఉండే అవకాశం ఉంది.
Also Read
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
- Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
- Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
Red Alert: హైదరాబాద్కు రెడ్ అలెర్ట్ జారీ.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
అర్హులైన వారు, ఇంకా బూస్టర్ డోస్ తీసుకోని వారు టీకా వేయించుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు డెస్క్లు ఏర్పాటు చేయనున్నారు. కాగితపు వినియోగాన్ని, పేపర్ బిల్లుల సర్క్యులేషన్ను నియంత్రించాలని సభ్యులకు విజ్ఞప్తి చేయనున్నట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. 2021లో చివరి వర్షాకాల సమావేశాల్లో తొలిసారిగా పార్లమెంట్లో కొవిడ్ ఆంక్షలు విధించారు.వాస్తవానికి, డిసెంబర్ 2021లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు రద్దు చేయబడ్డాయి. అనంతరం 2022 బడ్జెట్ సమావేశాలతో కలిపి వాటిని నిర్వహించారు. సమావేశాలు జులై18న ప్రారంభమై.. ఆగస్టు 12న ముగుస్తాయి. రాష్ట్రపతి, ఉపాధ్యక్ష ఎన్నికలతో పాటు ఈ సెషన్ కూడా జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికలకు జూలై 18న ఓటింగ్ జరగాల్సి ఉండగా, అవసరమైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు
తాజావార్తలు
-
Trump: ఓవల్ ఆఫీస్లో ట్రంప్ కునుకు.. వీడియో వైరల్
-
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
-
Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
-
Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
-
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!