Parliament Sessions: కొవిడ్ నిబంధనల మధ్య వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జులై 18న ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొవిడ్ నిబంధనల మధ్య జరగనున్నాయి. తదుపరి వర్షాకాల సమావేశాలు కూడా సామాజిక దూరం, భద్రతా నిబంధనలకు అనుగుణంగా కొవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం జరుగుతాయని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు చెప్పారు. శుక్రవారం నాడు 18వేలకు పైగా కేసులు నమోదు కాగా.. దేశవ్యాప్తంగా ఇంకా పెరుగుతూనే ఉన్నాయని.. ఈ నేపథ్యంలో గత కొన్ని సెషన్లుగా అమలులో ఉన్న కొవిడ్ ఆంక్షలు రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో కూడా కొనసాగుతాయన్నారు. లోక్సభతో పాటు రాజ్యసభకు చెందిన ఇరువురు సంరక్షకులు గణనీయమైన చర్చలు జరిపి, పర్యవేక్షించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి.
పార్లమెంటు సభ్యులు ఎల్లవేళలా మాస్క్లు ధరించి, భౌతిక దూరం నిబంధనలు కట్టుబడి ఉండాలని భావిస్తున్నారు. సభ్యుల సిట్టింగ్ లోక్సభతో పాటు రాజ్యసభ ఛాంబర్లలో, సందర్శకుల గ్యాలరీలో కూడా అందుబాటులో ఉంటుంది. రాబోయే సెషన్లో సందర్శకుల ప్రవేశం ఉండదని దీని అర్థం. గ్యాలరీల నుంచి సభా కార్యక్రమాలకు హాజరయ్యే మీడియా సిబ్బందిపై కూడా ఆంక్షలు కొనసాగుతాయి. రాజ్యసభ ఛాంబర్లో 60 మంది సభ్యులు, లోక్సభ ఛాంబర్లో 132 మంది కూర్చోవచ్చు. మిగిలిన సభ్యులకు ఉభయ సభల సందర్శకుల గ్యాలరీలో వసతి కల్పిస్తారు. ఎంపీ సిబ్బందిపై ఆంక్షలు, మంత్రులు పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు సిబ్బందిపై పరిమితి ఉండే అవకాశం ఉంది.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
Red Alert: హైదరాబాద్కు రెడ్ అలెర్ట్ జారీ.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
అర్హులైన వారు, ఇంకా బూస్టర్ డోస్ తీసుకోని వారు టీకా వేయించుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు డెస్క్లు ఏర్పాటు చేయనున్నారు. కాగితపు వినియోగాన్ని, పేపర్ బిల్లుల సర్క్యులేషన్ను నియంత్రించాలని సభ్యులకు విజ్ఞప్తి చేయనున్నట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. 2021లో చివరి వర్షాకాల సమావేశాల్లో తొలిసారిగా పార్లమెంట్లో కొవిడ్ ఆంక్షలు విధించారు.వాస్తవానికి, డిసెంబర్ 2021లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు రద్దు చేయబడ్డాయి. అనంతరం 2022 బడ్జెట్ సమావేశాలతో కలిపి వాటిని నిర్వహించారు. సమావేశాలు జులై18న ప్రారంభమై.. ఆగస్టు 12న ముగుస్తాయి. రాష్ట్రపతి, ఉపాధ్యక్ష ఎన్నికలతో పాటు ఈ సెషన్ కూడా జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికలకు జూలై 18న ఓటింగ్ జరగాల్సి ఉండగా, అవసరమైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!