Parliament Sessions: కొవిడ్ నిబంధనల మధ్య వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జులై 18న ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొవిడ్ నిబంధనల మధ్య జరగనున్నాయి. తదుపరి వర్షాకాల సమావేశాలు కూడా సామాజిక దూరం, భద్రతా నిబంధనలకు అనుగుణంగా కొవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం జరుగుతాయని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు చెప్పారు. శుక్రవారం నాడు 18వేలకు పైగా కేసులు నమోదు కాగా.. దేశవ్యాప్తంగా ఇంకా పెరుగుతూనే ఉన్నాయని.. ఈ నేపథ్యంలో గత కొన్ని సెషన్లుగా అమలులో ఉన్న కొవిడ్ ఆంక్షలు రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో కూడా కొనసాగుతాయన్నారు. లోక్సభతో పాటు రాజ్యసభకు చెందిన ఇరువురు సంరక్షకులు గణనీయమైన చర్చలు జరిపి, పర్యవేక్షించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి.
పార్లమెంటు సభ్యులు ఎల్లవేళలా మాస్క్లు ధరించి, భౌతిక దూరం నిబంధనలు కట్టుబడి ఉండాలని భావిస్తున్నారు. సభ్యుల సిట్టింగ్ లోక్సభతో పాటు రాజ్యసభ ఛాంబర్లలో, సందర్శకుల గ్యాలరీలో కూడా అందుబాటులో ఉంటుంది. రాబోయే సెషన్లో సందర్శకుల ప్రవేశం ఉండదని దీని అర్థం. గ్యాలరీల నుంచి సభా కార్యక్రమాలకు హాజరయ్యే మీడియా సిబ్బందిపై కూడా ఆంక్షలు కొనసాగుతాయి. రాజ్యసభ ఛాంబర్లో 60 మంది సభ్యులు, లోక్సభ ఛాంబర్లో 132 మంది కూర్చోవచ్చు. మిగిలిన సభ్యులకు ఉభయ సభల సందర్శకుల గ్యాలరీలో వసతి కల్పిస్తారు. ఎంపీ సిబ్బందిపై ఆంక్షలు, మంత్రులు పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు సిబ్బందిపై పరిమితి ఉండే అవకాశం ఉంది.
Also Read
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
Red Alert: హైదరాబాద్కు రెడ్ అలెర్ట్ జారీ.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
అర్హులైన వారు, ఇంకా బూస్టర్ డోస్ తీసుకోని వారు టీకా వేయించుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు డెస్క్లు ఏర్పాటు చేయనున్నారు. కాగితపు వినియోగాన్ని, పేపర్ బిల్లుల సర్క్యులేషన్ను నియంత్రించాలని సభ్యులకు విజ్ఞప్తి చేయనున్నట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. 2021లో చివరి వర్షాకాల సమావేశాల్లో తొలిసారిగా పార్లమెంట్లో కొవిడ్ ఆంక్షలు విధించారు.వాస్తవానికి, డిసెంబర్ 2021లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు రద్దు చేయబడ్డాయి. అనంతరం 2022 బడ్జెట్ సమావేశాలతో కలిపి వాటిని నిర్వహించారు. సమావేశాలు జులై18న ప్రారంభమై.. ఆగస్టు 12న ముగుస్తాయి. రాష్ట్రపతి, ఉపాధ్యక్ష ఎన్నికలతో పాటు ఈ సెషన్ కూడా జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికలకు జూలై 18న ఓటింగ్ జరగాల్సి ఉండగా, అవసరమైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు
తాజావార్తలు
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?