Parliament Sessions: కొవిడ్ నిబంధనల మధ్య వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జులై 18న ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొవిడ్ నిబంధనల మధ్య జరగనున్నాయి. తదుపరి వర్షాకాల సమావేశాలు కూడా సామాజిక దూరం, భద్రతా నిబంధనలకు అనుగుణంగా కొవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం జరుగుతాయని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు చెప్పారు. శుక్రవారం నాడు 18వేలకు పైగా కేసులు నమోదు కాగా.. దేశవ్యాప్తంగా ఇంకా పెరుగుతూనే ఉన్నాయని.. ఈ నేపథ్యంలో గత కొన్ని సెషన్లుగా అమలులో ఉన్న కొవిడ్ ఆంక్షలు రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో కూడా కొనసాగుతాయన్నారు. లోక్సభతో పాటు రాజ్యసభకు చెందిన ఇరువురు సంరక్షకులు గణనీయమైన చర్చలు జరిపి, పర్యవేక్షించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి.
పార్లమెంటు సభ్యులు ఎల్లవేళలా మాస్క్లు ధరించి, భౌతిక దూరం నిబంధనలు కట్టుబడి ఉండాలని భావిస్తున్నారు. సభ్యుల సిట్టింగ్ లోక్సభతో పాటు రాజ్యసభ ఛాంబర్లలో, సందర్శకుల గ్యాలరీలో కూడా అందుబాటులో ఉంటుంది. రాబోయే సెషన్లో సందర్శకుల ప్రవేశం ఉండదని దీని అర్థం. గ్యాలరీల నుంచి సభా కార్యక్రమాలకు హాజరయ్యే మీడియా సిబ్బందిపై కూడా ఆంక్షలు కొనసాగుతాయి. రాజ్యసభ ఛాంబర్లో 60 మంది సభ్యులు, లోక్సభ ఛాంబర్లో 132 మంది కూర్చోవచ్చు. మిగిలిన సభ్యులకు ఉభయ సభల సందర్శకుల గ్యాలరీలో వసతి కల్పిస్తారు. ఎంపీ సిబ్బందిపై ఆంక్షలు, మంత్రులు పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు సిబ్బందిపై పరిమితి ఉండే అవకాశం ఉంది.
Also Read
- UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
- Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
- Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
- Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
Red Alert: హైదరాబాద్కు రెడ్ అలెర్ట్ జారీ.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
అర్హులైన వారు, ఇంకా బూస్టర్ డోస్ తీసుకోని వారు టీకా వేయించుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు డెస్క్లు ఏర్పాటు చేయనున్నారు. కాగితపు వినియోగాన్ని, పేపర్ బిల్లుల సర్క్యులేషన్ను నియంత్రించాలని సభ్యులకు విజ్ఞప్తి చేయనున్నట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. 2021లో చివరి వర్షాకాల సమావేశాల్లో తొలిసారిగా పార్లమెంట్లో కొవిడ్ ఆంక్షలు విధించారు.వాస్తవానికి, డిసెంబర్ 2021లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు రద్దు చేయబడ్డాయి. అనంతరం 2022 బడ్జెట్ సమావేశాలతో కలిపి వాటిని నిర్వహించారు. సమావేశాలు జులై18న ప్రారంభమై.. ఆగస్టు 12న ముగుస్తాయి. రాష్ట్రపతి, ఉపాధ్యక్ష ఎన్నికలతో పాటు ఈ సెషన్ కూడా జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికలకు జూలై 18న ఓటింగ్ జరగాల్సి ఉండగా, అవసరమైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు
తాజావార్తలు
-
King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
-
Trump: ఇరాన్పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
-
Bhatti Vikramarka: తెలంగాణలో పెట్టుబడుల జోరు.. ఇన్వెస్ట్ తెలంగాణకు వార్ రూమ్
-
IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
-
UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..