Delhi: మ.3 గంటలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీ.. ఏం జరుగుతోంది!
- మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీ
- భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర పెద్దలు భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు జరుపుతున్నారు. సోమవారం ఉదయం ప్రధాని మోడీతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సైన్యం సన్నద్ధత గురించి ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహన్తో రాజ్నాథ్ ఆదివారం భేటీ అయ్యారు. ఆ సమావేశంలో మన సైన్యం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను రక్షణమంత్రి ప్రధానికి వివరించారు. భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ కూడా పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: దాడిని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం
Also Read
ఇక ఈ భేటీ తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా సమావేశం జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రక్షణపై చర్చించనున్నారు. ప్రధాని మోడీతో రాజ్నాథ్సింగ్ చర్చించిన అంశాలు.. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేట సాగిస్తున్నాయి. ఈ అంశంపై కూడా చర్చకు వచ్చే ఛాన్సుంది. ఢిల్లీలో వరుస భేటీలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా తుర్కియే సైనిక విమానాలు పాక్లో మోహరించాయి. పాక్ సైన్యానికి అవసరమైనవి చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Delhi: ప్రధాని మోడీతో రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ కీలక భేటీ.. ఉత్కంఠ రేపుతున్న చర్చలు
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్తో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. అంతేకాకుండా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు మూసివేసింది. తాజాగా పాక్కు సంబంధించిన 16 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది. ఇలా ఒక్కొక్కటిగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక ఉగ్ర దాడులకు పాల్పడ్డ నిందితుల సమాచారం అందిస్తే రూ.20లక్షల రివార్డ్ ప్రకటించింది. గత మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్ది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారు ఉండడం బాధాకరం.
తాజావార్తలు
-
Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
-
Modi-CM Vijay: ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ.. దేనికోసమంటే..!
-
CM Revanth Reddy : నీట్-యూజీ 2026 రద్దు… మోడీ సర్కార్ ఫెయిల్
-
Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్కుమార్ విశ్వరూపం!
-
Siddaramaiah: “హిజాబ్”కు అనుమతి, “కాషాయ కండువాల”కు నో పర్మిషన్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!