నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు నుంచి ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు జరగబోతున్నాయి. మొత్తం 20 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన తరువాత మొదట కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇటీవల తిరుపతి ఉపఎన్నికలో విజయం సాధించిన వైసీపీ అభ్యర్ధి మద్దిల గురుమూర్తితో సహా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. అనంతరం కొత్తగా మంత్రులుగా పదవీబాధ్యతలు స్వీకరించిన మంత్రులను సభకు పరిచయం చేస్తారు.
Read: తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని హీరో
Also Read
ఆ తరువాత ఇటీవల మృతి చెందిన 40 మంది మాజీ సభ్యులకు సభ నివాళులు అర్పిస్తుంది. ఈ కార్యక్రమాల అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో పెట్రోల్ ధరల పెరుగుదల, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ప్రభుత్వ వైఫల్యాలు, వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనలు వంటి పలు అంశాలపై ప్రతిపక్షాలు ప్రశ్నించనున్నాయి. ఇక ఈ సమావేశాల్లో 17 కొత్త బిల్లులతో పాటు, మరో రెండు ఆర్ధిక బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నది. అంతే కాకుండా ఇటీవల జారీ చేసిన మూడు ఆర్డినెన్స్లకు చట్టరూపం ఇవ్వబోతున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు మాత్రం ఫుల్ హ్యాపీ!
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
ట్రెండింగ్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?