Lovers Statue Marriage: బొమ్మలకు పెళ్లి.. నేటి తరం లైలా-మజ్నుల కథ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parents Performed Statue Wedding Of Lovers Who Died Six Months Back: అమర ప్రేమికులైన లైలా-మజ్నుల కథ అందరికీ తెలిసిందే. గాఢంగా ప్రేమించుకున్న ఆ ఇద్దరు.. ఒక్కటి కాకుండానే చనిపోయారు. చనిపోయిన తర్వాత తమ ప్రేమను గెలిపించుకున్నారు. అందుకే, నేటికీ వారి ప్రేమ గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అలాంటి కథే మరొకటి చోటు చేసుకుంది. బ్రతికున్నంతకాలం తమ ప్రేమని గెలిపించుకోలేకపోయిన ఓ జంట, చనిపోయిన తర్వాత తమ కోరికని కుటుంబ సభ్యులతో నేర్చుకోగలిగారు. గుజరాత్లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. తాపిలో నివశించే గణేష్, రంజనా గాఢంగా ప్రేమించుకున్నారు. రంజనాకు గణేష్ దూరపు బంధువు. ఆ బంధుత్వంతోనే ఏర్పడిన వీరి పరిచయం.. ప్రేమకు దారి తీసింది. ఒకరంటే ఒకరికి చచ్చేంత ఇష్టం ఏర్పడింది. పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలనుకున్నారు. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
Vladimir Putin: సందేహమే లేదు.. ఉక్రెయిన్పై గెలిచి తీరుతామన్న పుతిన్
Also Read
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
ఈ విషయాన్ని తమ కుటుంబసభ్యులకు తెలియజేశారు. అయితే.. పెద్దలు వారి ప్రేమని అంగీకరించలేదు. గణేష్ దూరపు బంధువే కావడంతో.. పెళ్లికి నిరాకరించారు. దీంతో వాళ్లు చాలా బాధపడ్డారు. తమ ప్రేమని అంగీకరించాలని, ఒకరిని వదిలి మరొకరు ఉండలేమని పెద్దలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లు వినిపించుకోలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో.. ఇక తాము ఎప్పటికీ కలవలేమని, తమ కోరిక నెరవేరే అవకాశం లేదని నిర్ణయించుకున్నారు. దాంతో.. ఆత్మహత్య చేసుకోవాలని ఫిక్సయి, ఆగస్టు 2022లో ఉరివేసుకొని ఆత్మహత్యచేసుకున్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం చెందారు. తమ పిల్లల ప్రేమను నిరాకరించి చాలా పెద్ద తప్పు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ వారి పెళ్లికి ఒప్పుకొని ఉండుంటే.. కనీసం తమ ముందైనా ఉండేవాళ్లని, కానీ తాము తీసుకున్న కఠిన నిర్ణయం వల్ల తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని కన్నీటిపర్యంతమయ్యారు.
Girls In Burqa: బురఖా ధరించి వచ్చిన విద్యార్థినులకు నో ఎంట్రీ.. కాలేజీలో ఉద్రిక్తత
ఈ నేపథ్యంలోనే కుటుంబ పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు. బతికుండగా వారి కల నెరవేర్చలేకపోయాం కాబట్టి, వారి విగ్రహాలను తయారు చేసి, వాటికి పెళ్లి చేయాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే విగ్రహాలు తయారు చేసి.. సరిగ్గా ఆ జంట చనిపోయిన ఆరు నెలలకు వారి విగ్రహాలకు ఘనంగా పెళ్లి జరిపించారు. ఈ వ్యవహారంపై అమ్మాయి తాత మాట్లాడుతూ.. గణేష్ దూరపు బంధువు కావడంతో వద్దునుకున్నామని చెప్పారు. ఐతే వారిద్దరూ ఒకరినొకరు ఎంతగానే ఇష్టపడ్డారని, అందుకే ఇరు కుటుంబాలు వారి విగ్రహాలకు పెళ్లి చేయాలనే ఆలోచనకు వచ్చి, ఇలా చేశామని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!