'Panauti' row: ప్రధాని నరేంద్రమోడీని చెడు శకునంగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా ఫైనల్ మ్యాచ్కి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. అయితే రాహుల్ గాంధీ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జలోర్లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ.. ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ.. చెడుశకునం కారణంగానే భారత్ మ్యాచ్ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.