Pakistan: ఓడ నుంచి “అణు సరుకు” స్వాధీనం చేసుకున్న భారత్.. పాకిస్తాన్ ఏం చెప్పిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: అణు కార్యక్రమాలు, బాలిస్టిక్ క్షిపణుల నిర్మాణానికి దోహదపడే సరుకుతో పాకిస్తాన్ వెళ్తున్న ఓడను భారత అధికారులు ముంబైలోని నవషేవా పోర్టులో అడ్డుకున్నారు. ఈ సరకు చైనా నుంచి పాకిస్తాన్ లోని కరాచీకి వెళ్తున్నట్లు తేలింది. అయితే, దీనిపై పాకిస్తాన్ స్పందించింది. వాస్తవాలను తప్పుడుగా చూపిస్తోందని పాక్ విదేశంగా కార్యలయం ఆదివారం పేర్కొంది. జనవరి 23న చైనా నుంచి పాకిస్తాన్ వెళ్తున్న ఓడ CMA CGM అట్టిలాను ముంబైలోని నవా షెవా పోర్ట్లో నిలిపివేశారు. ఈ ఓడలో కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్(సీఎన్సీ) యంత్రాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అధికారులు కనుగొన్నారు.
Read Also: Balineni Srinivasa Reddy: పట్టాలు కరెక్ట్ కాదని నిరూపిస్తే పోటీ కూడా చేయను.. బాలినేని సవాల్
Also Read
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
అణు కార్యక్రమాల్లో ఈ యంత్రాన్ని వాడుతారని తేలింది. యూరప్, అమెరికాల ద్వారా చైనా మార్గంలో పాకిస్తాన్ ఇలాంటి సరుకులు తీసుకువస్తోందని అనుమానిస్తున్నారు. అయితే, కరాచీకి చెందిన ఒక కంపెనీ కోసం కమర్షియల్ లాత్ మెషీన్ని రవాణా చేస్తోందని పాకిస్తాన్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ఇది పాకిస్తాన్ ఆటోమొబైల్ పరిశ్రమకు విడిభాగాలను సరఫరా చేసే కరాచీకి చెందిన సంస్థకు లాత్ మిషన్ను దిగుమతి చేసుకుంటున్నాము. పరికరాల స్పెసిఫికేషన్ దాని పూర్తి వాణిజ్య వినియోగాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. లావాదేవీలు పారదర్శక బ్యాంకింగ్ మార్గాల ద్వారా నిర్వహించబడుతుంది. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి’’ అంటూ పాకిస్తాన్ పేర్కొంది.
దీనిని భారత్ స్వాధీనం చేసుకోవడం అన్యాయమని, ఇది అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘన అని పాకిస్తాన్ చెప్పింది. వాణిజ్య వస్తువులను స్వాధీనం చేసుకున్న భారత్ వైఖరిని పాక్ ఖండిస్తోందని, ఇది స్వేచ్ఛా వాణిజ్యానికి అంతరాయమని పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఏకపక్ష చర్యలకు భారత్ పాల్పడిందని పాక్ విదేశాంగా కార్యలయం ప్రకటన విడుదల చేసింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!