Pakistan: ఓడ నుంచి “అణు సరుకు” స్వాధీనం చేసుకున్న భారత్.. పాకిస్తాన్ ఏం చెప్పిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: అణు కార్యక్రమాలు, బాలిస్టిక్ క్షిపణుల నిర్మాణానికి దోహదపడే సరుకుతో పాకిస్తాన్ వెళ్తున్న ఓడను భారత అధికారులు ముంబైలోని నవషేవా పోర్టులో అడ్డుకున్నారు. ఈ సరకు చైనా నుంచి పాకిస్తాన్ లోని కరాచీకి వెళ్తున్నట్లు తేలింది. అయితే, దీనిపై పాకిస్తాన్ స్పందించింది. వాస్తవాలను తప్పుడుగా చూపిస్తోందని పాక్ విదేశంగా కార్యలయం ఆదివారం పేర్కొంది. జనవరి 23న చైనా నుంచి పాకిస్తాన్ వెళ్తున్న ఓడ CMA CGM అట్టిలాను ముంబైలోని నవా షెవా పోర్ట్లో నిలిపివేశారు. ఈ ఓడలో కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్(సీఎన్సీ) యంత్రాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అధికారులు కనుగొన్నారు.
Read Also: Balineni Srinivasa Reddy: పట్టాలు కరెక్ట్ కాదని నిరూపిస్తే పోటీ కూడా చేయను.. బాలినేని సవాల్
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
అణు కార్యక్రమాల్లో ఈ యంత్రాన్ని వాడుతారని తేలింది. యూరప్, అమెరికాల ద్వారా చైనా మార్గంలో పాకిస్తాన్ ఇలాంటి సరుకులు తీసుకువస్తోందని అనుమానిస్తున్నారు. అయితే, కరాచీకి చెందిన ఒక కంపెనీ కోసం కమర్షియల్ లాత్ మెషీన్ని రవాణా చేస్తోందని పాకిస్తాన్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ఇది పాకిస్తాన్ ఆటోమొబైల్ పరిశ్రమకు విడిభాగాలను సరఫరా చేసే కరాచీకి చెందిన సంస్థకు లాత్ మిషన్ను దిగుమతి చేసుకుంటున్నాము. పరికరాల స్పెసిఫికేషన్ దాని పూర్తి వాణిజ్య వినియోగాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. లావాదేవీలు పారదర్శక బ్యాంకింగ్ మార్గాల ద్వారా నిర్వహించబడుతుంది. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి’’ అంటూ పాకిస్తాన్ పేర్కొంది.
దీనిని భారత్ స్వాధీనం చేసుకోవడం అన్యాయమని, ఇది అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘన అని పాకిస్తాన్ చెప్పింది. వాణిజ్య వస్తువులను స్వాధీనం చేసుకున్న భారత్ వైఖరిని పాక్ ఖండిస్తోందని, ఇది స్వేచ్ఛా వాణిజ్యానికి అంతరాయమని పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఏకపక్ష చర్యలకు భారత్ పాల్పడిందని పాక్ విదేశాంగా కార్యలయం ప్రకటన విడుదల చేసింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!