India Pakistan: పాకిస్తాన్ ‘‘ఫేక్ ప్రచారం’’ కొనసాగుతోంది.. వీడియో గేమ్ని కూడా వదలడం లేదు..
- భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ తప్పుడు ప్రచారం..
- తన ప్రజల్ని నమ్మించేందుకు శత విధాల ప్రయత్నాలు..
- చివరకు వీడియో గేమ్ వీడియోని కూడా వదలడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan:భారత్ చేతిలో భంగపడుతున్నప్పటికీ, పాకిస్తాన్ మాత్రం తన ప్రజల్ని ఫేక్ ప్రచారంతో నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ప్రతికూల విషయాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ పాక్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది. పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్, పాక్ మీడియా కలిసి పాక్ ప్రజల్ని బకరాలను చేస్తున్నాయి.
* భారత్ పంపించిన 25 నుంచి 29 డ్రోన్లను కూల్చినట్లు ప్రముఖ పాక్ ఛానెల్ జియో న్యూస్ చెప్పింది. నిజానికి దీనికి సంబంధించిన ఒక్క రుజువును కూడా చూపించలేదు. నిజం ఏంటంటే, భారత్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని, భారత్పైకి ప్రయోగించిన డ్రోన్లను, క్షిపణులను కూల్చేయడం.
Also Read
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
* పాకిస్తాన్ సైన్యం అమాయకులైన భారతీయ పౌరులపై దాడులు నిర్వహించింది. ఎల్ఓసీ వద్ద గ్రామాలపై దాడులు జరిపింది. ఈ దాడుల్లో 16 మంది సాధారణ పౌరులు మరణించారు. అయితే, పాకిస్తాన్ మాత్రం తాము భారత సైన్యానికి చెందిన 50 మందిని చంపినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటోంది.
* నిజానికి ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ పాకిస్తాన్లోని 9 ప్రాంతాల్లో 24 దాడులు నిర్వహించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కార్యాలయాలను, శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసింది. 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. అయితే, ఈ విషయాన్ని ఒక్క పాకిస్తాన్ మీడియా కూడా వెల్లడించలేదు. వీటిని పౌర మరణాలుగా చెప్పింది.
* ఈరోజు తెల్లవారుజామున, భారీ MLRS (మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్) బ్యారేజీని భారతదేశంపై నిజమైన పాకిస్తాన్ దాడిగా చూపించే తప్పుడు వీడియోను షేర్ చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రకారం, ఈ ఫుటేజ్ ఒక వీడియో గేమ్ నుండి తీసుకోబడింది మరియు మూడు సంవత్సరాలకు పైగా ఆన్లైన్లో ఉంది. అమృత్సర్పై దాడి చేశామని పాక్ మీడియా, ఎస్ఎం తప్పుడు కథనాలను సృష్టించింది.
* పాకిస్తాన్ ఆర్మీతో సంబంధాలు ఉన్న సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా.. శ్రీనగర్లోని భారత వైమానిక స్థావరంపై పాక్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసిందని తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నాయి. నిజానికి అలాంటి దాడే జరగలేదు. దాడి చేయడానికి వచ్చిన పాక్ డ్రోన్లు,క్షిపణుల్ని మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నామరూపాలు లేకుండా చేసింది.
🚨 Pakistan Propaganda Alert!
A video showing a heavy MLRS (Multiple Launch Rocket Systems) barrage is being falsely shared as a real Pakistani attack on India.#PIBFactCheck
✅ The video is from a video game and has been online for over 3 years.
✅ It has no connection to… pic.twitter.com/VXAE93YfXs
— PIB Fact Check (@PIBFactCheck) May 9, 2025
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!