India Pakistan: పాకిస్తాన్ ‘‘ఫేక్ ప్రచారం’’ కొనసాగుతోంది.. వీడియో గేమ్ని కూడా వదలడం లేదు..
- భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ తప్పుడు ప్రచారం..
- తన ప్రజల్ని నమ్మించేందుకు శత విధాల ప్రయత్నాలు..
- చివరకు వీడియో గేమ్ వీడియోని కూడా వదలడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan:భారత్ చేతిలో భంగపడుతున్నప్పటికీ, పాకిస్తాన్ మాత్రం తన ప్రజల్ని ఫేక్ ప్రచారంతో నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ప్రతికూల విషయాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ పాక్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది. పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్, పాక్ మీడియా కలిసి పాక్ ప్రజల్ని బకరాలను చేస్తున్నాయి.
* భారత్ పంపించిన 25 నుంచి 29 డ్రోన్లను కూల్చినట్లు ప్రముఖ పాక్ ఛానెల్ జియో న్యూస్ చెప్పింది. నిజానికి దీనికి సంబంధించిన ఒక్క రుజువును కూడా చూపించలేదు. నిజం ఏంటంటే, భారత్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని, భారత్పైకి ప్రయోగించిన డ్రోన్లను, క్షిపణులను కూల్చేయడం.
Also Read
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
* పాకిస్తాన్ సైన్యం అమాయకులైన భారతీయ పౌరులపై దాడులు నిర్వహించింది. ఎల్ఓసీ వద్ద గ్రామాలపై దాడులు జరిపింది. ఈ దాడుల్లో 16 మంది సాధారణ పౌరులు మరణించారు. అయితే, పాకిస్తాన్ మాత్రం తాము భారత సైన్యానికి చెందిన 50 మందిని చంపినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటోంది.
* నిజానికి ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ పాకిస్తాన్లోని 9 ప్రాంతాల్లో 24 దాడులు నిర్వహించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కార్యాలయాలను, శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసింది. 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. అయితే, ఈ విషయాన్ని ఒక్క పాకిస్తాన్ మీడియా కూడా వెల్లడించలేదు. వీటిని పౌర మరణాలుగా చెప్పింది.
* ఈరోజు తెల్లవారుజామున, భారీ MLRS (మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్) బ్యారేజీని భారతదేశంపై నిజమైన పాకిస్తాన్ దాడిగా చూపించే తప్పుడు వీడియోను షేర్ చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రకారం, ఈ ఫుటేజ్ ఒక వీడియో గేమ్ నుండి తీసుకోబడింది మరియు మూడు సంవత్సరాలకు పైగా ఆన్లైన్లో ఉంది. అమృత్సర్పై దాడి చేశామని పాక్ మీడియా, ఎస్ఎం తప్పుడు కథనాలను సృష్టించింది.
* పాకిస్తాన్ ఆర్మీతో సంబంధాలు ఉన్న సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా.. శ్రీనగర్లోని భారత వైమానిక స్థావరంపై పాక్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసిందని తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నాయి. నిజానికి అలాంటి దాడే జరగలేదు. దాడి చేయడానికి వచ్చిన పాక్ డ్రోన్లు,క్షిపణుల్ని మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నామరూపాలు లేకుండా చేసింది.
🚨 Pakistan Propaganda Alert!
A video showing a heavy MLRS (Multiple Launch Rocket Systems) barrage is being falsely shared as a real Pakistani attack on India.#PIBFactCheck
✅ The video is from a video game and has been online for over 3 years.
✅ It has no connection to… pic.twitter.com/VXAE93YfXs
— PIB Fact Check (@PIBFactCheck) May 9, 2025
తాజావార్తలు
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!