NTV Telugu Site icon

India-Pak: భారతీయ వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు.. పాకిస్తాన్ నుంచి వచ్చిన యువతి..

Pakistan

Pakistan

India-Pak: ఇటీవల కాలంలో పాకిస్తాన్ యువతులు, ఇండియన్ అబ్బాయిలకు పడిపోతున్నారు. తాజాగా ఓ పాకిస్తాన్ యువతి ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు వచ్చింది. కోల్‌కతాకు చెందిన వ్యక్తి సమీర్ ఖాన్‌ని పెళ్లి చేసుకునేందుకు కరాచీకి చెందిన యువతి జవేరియా ఖానుమ్ భారత్ వచ్చింది.మంగళవారం వాఘా-అట్టారీ అంతర్జాతీయ సరిహద్దు నుండి భారతదేశానికి చేరుకుంది.. వచ్చే ఏడాది జనవరిలో వీరిద్దరి వివాహం నిశ్చయమైంది. కాబోయే కోడలికి భర్త సమీర్ ఖాన్, అతని కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు.

Read Also: Beggar : జేబులో లక్షలు ఉన్నా ఆకలితో ప్రాణాలు కోల్పోయిన బిక్షగాడు..!

గతంలో ఖానుమ్‌కి రెండుసార్లు వీసా ఇచ్చేందుకు భారత్ తిరస్కరించింది. అయితే తాజాగా 45 రోజుల వీసాను మంజూరు చేసింది. అయితే కోవిడ్ కారణంగా వీరి పెళ్లి ప్రణాళిక ఐదేళ్ల పాటు నిలిచిపోయింది. ‘‘ నాకు 45 రోజలు వీసా మంజూరు చేశారు. నేను ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఇక్కడ చాలా ప్రేమ లభించింది. జనవరి మొదటి వారంలో తమ వివాహం జరుగుతుంది’’ అని ఆమె చెప్పింది. ఐదేళ్ల తర్వాత తనకు వీసా లభించడం పట్ల పాక్ యువతి సంతోషాన్ని వ్యక్తం చేసింది.

తన తల్లి ఫోన్‌లో ఖానుమ్ ఫోటో చూసిన తర్వాత తననే పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు సమీర్ ఖాన్ వెల్లడించారు. మే 2018లో తమ పరిచయం ప్రారంభమైందని, జర్మనీలో చదువుకుంటున్న సమయంలో ఇంటికి వచ్చానని, ఆ సమయంలో జవేరియా ఫోటోను చూశానని, పెళ్లి చేసుకోవాలనుకున్నానని తన స్టోరీని చెప్పాడు.