Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pahalgam Terror Attack Module That Struck Pahalgam Handled By Lashkar Chief Hafiz Saeed Report

Pahalgam Terror Attack: హఫీజ్ సయీద్ నేతృత్వంలోనే పహల్గామ్ దాడి.. నివేదిక వర్గాలు నిర్ధారణ!

Published Date :April 25, 2025 , 12:42 pm
By Suresh Maddala
  • హఫీజ్ సయీద్ నేతృత్వంలోనే పహల్గామ్ దాడి
  • నివేదిక వర్గాలు నిర్ధారణ!
Pahalgam Terror Attack: హఫీజ్ సయీద్ నేతృత్వంలోనే పహల్గామ్ దాడి.. నివేదిక వర్గాలు నిర్ధారణ!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

పహల్గామ్ ఉగ్ర దాడి వెనుక ఉన్న కుట్రను కేంద్ర సంస్థలు వెలికితీస్తున్నాయి. 26/11 ముంబై దాడుల కుట్రదారుడు, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఆధ్వర్యంలోనే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగినట్లుగా భద్రతా సంస్థలు ఇక నిర్ధారణకు వచ్చినట్లు వర్గాలు పేర్కొన్నాయి.

పహల్గామ్ దాడి జరగగానే తామే ఈ దాడి చేసినట్లుగా ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. ఇది లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా ఉంది. దీనికి హఫీజ్ సయీద్ ముఖ్య అనుచరుడైన సైఫుల్లా ఖలీద్ అలియాస్ సైఫుల్లా కసూరి నేతృత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి ఆధ్వర్యంలోనే ఈ ఉగ్ర సంస్థలు నడుస్తున్నాయి. ఇద్దరి మాడ్యూల్ ప్రకారం పహల్గామ్ దాడి జరిగినట్లుగా భారత నిఘా సంస్థలు కనిపెట్టాయి. ఇక ఈ ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ సైన్యం, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పూర్తి మద్దతు ఉంటుంది. సైద్ధాంతిక, లాజిస్టికల్ మరియు వ్యూహాత్మక మద్దతు ఇస్తుంటాయి.

Also Read

  • Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
  • PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
  • Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
  • Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
Add as a preferred
source on google

ఇక స్థానిక ఉగ్రవాదుల మద్దతుతో బైసరన్ లోయలో లష్కరే తోయిబా దాడులకు పాల్పడినట్లుగా గుర్తించింది. ముందుగా అక్కడ గ్రౌండ్ వర్క్ కూడా చేసినట్లుగా అనుమానిస్తు్న్నారు. స్థానిక మద్దతుదారుల సహకారంతోనే ఈ ఉగ్ర దాడి జరినట్లుగా ఒక నిర్ధారణకు వచ్చారు. 2024, అక్టోబర్‌లో బూటా పత్రి దగ్గర జరిగిన ఉగ్ర దాడిలో కూడా ఈ పహల్గామ్‌లో పాల్గొన్నవారే ఉన్నట్లుగా గుర్తించింది. ఆ దాడిలో ఇద్దరు సైనికులతో పాటు నలుగురు సామాన్య పౌరులు చనిపోయారు. అదే నెలలో సోనామార్గ్‌లో సొరంగం నిర్మాణ కార్మికులపై జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు కార్మికులు, ఒక వైద్యుడు చనిపోయాడు. ఈ దాడిలో కూడా ఈ ఉగ్రవాదులే పాల్గొన్నట్టుగా కనిపెట్టారు. వీళ్లంతా లష్కరే తోయిబా కనుసన్నల్లో నడుచుకుంటున్నట్లుగా గుర్తించారు. పహల్గామ్ ఉగ్రవాదుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.

ఇక మంగళవారం ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులు ఊహాచిత్రాలను బుధవారం విడుదల చేశారు. ముగ్గురు ఉగ్రవాదుల్లో పాకిస్థాన్‌కు చెందిన హషీమ్ ముసా అలియాస్ సులేమాన్, అలీ భాయ్ అలియాస్ తల్హా, మూడో వ్యక్తి స్థానిక నివాసి అబ్దుల్ హుస్సేన్ థోకర్‌గా గుర్తించారు. ఇక వీళ్ల సమాచారం అందిస్తే.. రూ.20లక్షల రివార్డ్ ఇస్తామని ఇప్పటికే భద్రతా దళాలు ప్రకటించాయి.

పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. ఇందులో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారే ఉండడం విశేషం. అనేక మంది గాయాలు పాలయ్యారు. ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారు. ఇక ఈ ఘటనతో బాధితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికీ ఆ ఘటనను నుంచి తేరుకోలేకపోతున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Lashkar chief hafiz saeed
  • Pahalgam terror attack
  • Pahalgam terror attack module
  • report
  • Struck pahalgam handled

తాజావార్తలు

  • PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్‌పై ఉత్కంఠభరిత గెలుపు.!

  • Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ

  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్

  • Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్‌లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!

  • PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions