Ozempic: ఇండియాలో డయాబెటిస్ సూపర్ డ్రగ్ ‘ఒజెంపిక్’ లాంచ్.. ధర, ఎలా వాడాలంటే.
- ఇండియాలో డయాబెటిక్ డ్రగ్ ఒజెంపిక్ లాంచ్..
- దేశంలో పెరిగిన GLP-1 డ్రగ్ మార్కెట్..
- మౌంజారో ఆధిపత్యాన్ని సవాల్ చేయనున్న ఒజెంపిక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ozempic: డెన్మార్క్ ఔషధ తయారీదారు ‘‘నోవో నార్డిస్క్(Novo Nordisk)’’ భారతదేశంలో తన ప్రతిష్టాత్మక డయాబెటిస్ డ్రగ్ ‘‘ఒజెంపిక్’’(Ozempic)ను ప్రవేశపెట్టింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత్తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని అనుకుంటోంది. HbA1c 7 శాతం కన్నా ఎక్కువగా ఉన్న పెద్దలకు ఈ మందు అనుకూలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బులు, రిస్క్ ఎక్కువగా ఉన్న పెద్దలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఆకలిని తగ్గించే ప్రభావం వల్ల వెయిట్ లాస్ కోసం కూడా ఉపయోగపడనుంది.
Read Also: Messi Match: మెస్సీ ఫుట్బాల్ ఈవెంట్కు కట్టుదిట్టమైన భద్రత.. మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్లతో నిఘా
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
ఒజెంపిక్లో సెమాగ్లటైడ్(Semaglutide) అనే హార్మోన్ ఉంటుంది. ఇది రక్తంలోని షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. దీనిని వారానికి ఒకటి, ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 2,200గా ఉంది. భారతదేశంలో స్థూలకాయం పెరుగుతోంది. 25.4 కోట్ల మంది స్థూలకాంలో బాధపడుతుంటేన 35.1 కోట్ల మంది పొట్ట చుట్టూ కొవ్వుతో హెల్త్ రిస్క్ ఎదుర్కొంటున్నారు. దీంతోనే భారతదేశంలో GLP-1 మందులకు భారీ డిమాండ్ ఏర్పడింది.
భారతదేశంలో GLP-1 మందుల మార్కెట్లో యూఎస్కు చెందిన ఎలీ లిల్లీ కంపెనీకి చెందిన మౌంజారో (Mounjaro) దూసుకుపోతోంది. ఇండియాలో మొదట ప్రారంభమైన GLP మందు కావడంతో మార్కెట్ను పట్టుకుంది. అక్టోబర్, నవంబర్లలో దీని సేల్స్ రూ. 100 కోట్లను దాటింది. మార్కెట్ షేర్ 86-91 శాతం ఉంది. మరోవైపు, నోవో నార్డిస్క్ నవంబర్ నెలలో వెగోవీ(Wegovy) ధరల్ని తగ్గించడంతో ఈ మార్కెట్లో మరింత పోటీకి తెరతీసింది. GLP-1 మార్కెట్లో వెగోవీ వాటా అక్టోబర్లో 9 శాతం నుండి నవంబర్లో 14 శాతానికి పెరిగింది, అదే సమయంలో మౌంజారో వాటా 91 శాతం నుండి 86 శాతానికి తగ్గింది. ఎలీ లిల్లీ, నోవో నార్డిస్క్ రెండు సంస్థలు కూడా నగరాల నుంచి తన ఇతర ప్రాంతాలకు తమ మార్కెట్ను విస్తరించేందుకు సిప్లా, ఎంక్యూర్ వంటి భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంటున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!