ముద్దుగుమ్మ తాప్సీ పన్ను గురించి పరిచయం అక్కర్లేదు. ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత మిస్టర్ పర్ ఫెక్ట్, గుండెల్లో గోదారి, సాహసం, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు సినిమాల్లో బిజీగా ఉండగానే బాలీవుడ్కు జంప్ అయిన తాప్సీ అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది. నిర్మాతగా కూడా రాణిస్తూ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది. ఇక ప్రస్తుతం ఆమె నటిస్తున్న వో లడ్కీ హై కహా, గాంధారి సినిమాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండగా, రీసెంట్గా తాప్సీ ఖాతలోకి మరో ఆసక్తికరమైన సినిమా వచ్చి చేరింది.
Also Read : Mani Ratnam : మణిరత్నం కోసం రాజీ పడిన ప్రశాంత్ నీల్.. ?
2018లో ఆమె నటించిన సూపర్హిట్ కోర్ట్ డ్రామా ‘ముల్క్’ సినిమా అంత చూసే ఉంటారు. ఆ సినిమా సీక్వెల్గా ‘ముల్క్ 2’ రానున్నట్టు తాప్సీ స్వయంగా తెలిపింది. ‘నా మనసుకు దగ్గరైన పాత్ర ‘ముల్క్’లో చేశాను. పాకిస్తాన్ ఉగ్రవాదం వల్ల ఓ భారతీయ ఇస్లాం కుటుంబం ఎదుర్కొన్న అవమానాల్నీ, బాధల్నీ కళ్లకు కట్టినట్లు చూపించింది ‘ముల్క్’. ఇప్పుడు ఫస్ట్పార్ట్ని మించేలా ‘ముల్క్ 2’ కథ రాసుకున్నారు డైరెక్టర్ అనుభవ్ సిన్హా. ఐడెండిటీ, విశ్వాసం, పౌరహక్కుల నేపథ్యంలో సాగే అద్భుతమైన కథగా ఈ సీక్వెల్ ఉంటుంది. సెట్స్కి ఎప్పుడెప్పుడు వెళ్తానా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న’ అని తెలిపారు తాప్సీ పన్ను.