Operation Octopus: 8 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. 170 మంది పీఎఫ్ఐ కార్యకర్తల అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA raids on PFI in 8 states: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మరోసారి దాడులు నిర్వహించింది. గత వారం దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ రాడికల్ ఇస్లామిక్ సంస్థ పీఎఫ్ఐపై దాడులు చేసి 106 మంది అగ్రనాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసింది. తాజాగా మంగళవారం 8 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ దాడుల చేసింది. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది.
ఈ ఎనిమిది రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 170 మంది పీఎఫ్ఐ కార్యకర్తనలు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని షాహీన్ బాగ్, నిజాముద్దీన్, జామియా నగర్ ప్రాంతాల్లో దాడులు చేసింది ఏన్ఐఏ. ఇక్కడ 30 మందిని అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ అధికారులతో పాటు, ఢిల్లీ పోలీసులు, స్పెషల్ ఫోర్సెస్ ఈ దాడుల్లో పాల్గొన్నాయి. నవంబర్ 17 వరకు జామియానగర్ ప్రాంతంలో సెక్షన్ 144 విధించారు అధికారులు. కర్ణాటకలో బీదర్, మంగళూర్, కోలార్, వజయనగర, బాగల్ కోట్, చిత్రదుర్గ, బళ్లారి, చామరాజనగర్ ప్రాంతాల్లో దాడులు చేసి 75 మందిని అరెస్ట్ చేశారు.
Also Read
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
Read Also: Nasa: నాసా ప్రయోగం సక్సెస్.. గ్రహశకలాన్ని ఢీకొట్టిన నాసా అంతరిక్ష నౌక
అస్సాం రాష్ట్రంలో గోల్ పరా, కామ్ రూప్, బార్ పేట, ధుబ్రి, బాగ్సా, దర్రాంగ్, ఉదల్ గిరి, కరీంగంజ్ జిల్లాల్లో 25 మంది పీఎఫ్ఐ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలో పూణేలో ఆరుగురు, ముంబ్రాలో ఇద్దరు, బివాండీ, కళ్యాణ్ నుంచి ఒక్కొ పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. గుజరాత్ రాష్ట్రం నుంచి 10 మందిని, మధ్యప్రదేశ్ నుంచి 21 మంది పీఎఫ్ఐ లీడర్లను అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో లక్నో, బక్షి తలాబ్, ఇతౌంజా నుంచి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పీఎఫ్ఐ సంస్థ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ ఆరోపిస్తోంది. దేశంతో మతసామరస్యాన్ని దెబ్బతీయడంతో పాటు యువతను ఐసిస్, లష్కరే తోయిబా, ఆల్ ఖైదా వంటి ఉగ్రసంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తోందని ఎన్ఐఏ విచారణలో తేలింది. దీంతో పాటు ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలే లక్ష్యం దాడులు చేసేందకు కూడా ప్రయత్నిస్తున్నట్లు మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ సంచలన విషయాలను వెల్లడించింది. దసరా సందర్భంగా జరిగే ఉత్సవాల్లో దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లు ఎటీఎస్ తెలిపింది.
తాజావార్తలు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!