Operation Akhal: కుక్క చావు చచ్చారు.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం..
- కుల్గామ్ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం..
- ఆపరేషన్ అఖల్లో భాగంగా జరిగిన ఎన్కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Akhal: శుక్రవారం జమ్మూ కాశ్మీర్ కుల్గామ్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఎన్కౌంటర్ ‘‘ఆపరేషన్ అఖల్’’లో భాగంగా జరిగింది. దేవ్సర్ ప్రాంతంలోని అఖల్ అడవిలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఈ ఉమ్మడి ఆపరేషన్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)తో అనుబంధంగా ఉన్నారని మరియు ఇటీవలి పహల్గామ్ దాడితో సంబంధం కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల్లో లష్కరే కీలక ఉగ్రవాది పుల్వామా నివాసి హరిస్ నజీర్ ఉన్నాడు. ఇతడిని భద్రతా బలగాలు ‘‘కేటగిరీ-సీ’’ ఉగ్రవాదిగా గుర్తించింది.
ఈ ప్రాంతంలో ఉగ్రవాద కదలికల గురించి నిఘా వర్గాల సమాచారం మేరకు భారత సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ సమయంలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. దీంతో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. శ్రీనగర్ సమీపంలోని దచిగామ్ నేషనల్ పార్క్ లోపల ఉగ్రవాదులు దాక్కున్నారనే పక్కా సమాచారం ఆధారంగా ఆపరేషన్ నిర్వహించారు.
Also Read
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
- Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
- PM Modi: డ్రగ్స్కు దూరంగా యువత.. వికసిత్ భారత్కు అదే కీలకం.. ‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
Read Also: PM Modi: ట్రంప్ ‘‘డెడ్ ఎకానమీ’’ కామెంట్స్కి మోడీ అదిరిపోయే కౌంటర్..
ఆపరేషన్ మహాదేవ్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైన కొన్ని రోజులకే ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఆ ఎన్కౌంటర్లో పాకిస్తాన్కు చెందిన ముగ్గురు టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు ఉన్నారు. పహల్గామ్ కుట్రదారుడు లష్కర్ కమాండర్ సులేమాన్ షా అలియాస్ ముసా ఫౌజీ కూడా ఉన్నారు. వారి రహస్య స్థావరం నుండి 17 గ్రెనేడ్లు, ఒక ఎం4 కార్బైన్ మరియు రెండు ఎకె-47 రైఫిల్స్తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల ప్రకారం, ఈ ప్రాంతంలో ఐదుగురు టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు యాక్టివ్గా ఉన్నారు. ఆపరేషన్ మహాదేవ్లో ముగ్గురు మరణించగా, ఇప్పుడు తాజా ఎన్కౌంటర్లో ఒకరు హతమయ్యాడు. మరొకరు పరారీలో ఉన్నట్లు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన ‘షాపింగ్’ కింగ్..
-
AI Effect : AI దెబ్బకు ఉద్యోగాలే మాయం.. చైనాలో మొదలైన ఉపాధి సంక్షోభం.!
-
Elon Musk : నెలలోనే రూ.57 లక్షల కోట్ల ఆవిరి.. ఎలాన్ మస్క్కు భారీ దెబ్బ.!
-
Yuvraj Singh: యువరాజ్ ‘యువి’ పేరు వాడుతున్నారా..? ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..
-
Yellamma First Look: సంగీత దర్శకుడు కాదు.. ఇప్పుడు హీరో డీఎస్పీ!.. అదిరిపోయిన ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?