Supreme Court: నేరాలు చేసి పారిపోయిన వాళ్లను పట్టుకొచ్చే హక్కు ఉంది..
- నేరాలు చేసి పారిపోయిన వారినిపట్టుకొచ్చే అధికారం కేంద్రానికి ఉంది..
- గుజరాత్కు చెందిన విజయ్ మురళీధర్ ఉద్వానీ తనపై నమోదైన 153 కేసులు..
- దుబాయ్కు పారిపోయిన ఉద్వానీ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడం కరెక్టే: సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: భారత్ లో నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన వ్యక్తులను పట్టుకొచ్చే సర్వాధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. అయితే, గుజరాత్కు చెందిన విజయ్ మురళీధర్ ఉద్వానీ తనపై నమోదైన 153 కేసులకు సంబంధించి జారీ అయిన రెడ్ కార్నర్ నోటీస్పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిల్ ను విచారణకు తిరస్కరించినట్లు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం పేర్కొనింది.
Read Also: TTD : యాంకర్ శివ జ్యోతి ఆధార్ కార్డు బ్లాక్… శ్రీవారి దర్శనంపై జీవితకాల నిషేధం
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
ఇక, 2022 జులైలోనే దుబాయ్కు పారిపోయిన మీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడం కరెక్టేనంటూ గతంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఉద్వానీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ సందర్భంగా.. మీపై అనేక ఆరోపణలు, 153 కేసులు సైతం ఉన్నాయి.. ముందు భారత్ రావాల్సిందే.. వస్తే ఎర్రతివాచీ పరిచి స్వాగతం చెబుతామని అనుకో వద్దని తెలిపింది. అయితే, తన పిటిషన్దారుకు తనపై 38 కేసుల వివరాలు కూడా తెలీయదని అతడి తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. వివరాలు తెలీయదంటే ఎలా? ట్రయల్ కోర్టుకు వెళ్లి సర్టిఫైడ్ కాపీల కోసం అప్లై చేస్తే వాళ్లే ఇస్తారని తెలిపింది. ఇదేం రాకెట్ తయారీ శాస్త్రం కాదు.. అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందని అన్నారు. ఎఫ్ఐఆర్లలోని వివరాలను అధికారులు చెప్పడం లేదని లాయర్ వాదించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.
Read Also: YouTube: “జై భజరంగబలి”.. 500 కోట్ల వ్యూస్ సాధించిన తొలి ఇండియన్ వీడియోగా “హనుమాన్ చాలీసా”..
అయితే, ఎఫ్ఐఆర్ వివరాలు మీకు దుబాయ్కి వచ్చి బంగారు పళ్లెంలో పెట్టి అందించాలా? ముందు భారత్కు రండి.. వచ్చిన తర్వాత అన్ని వివరాలు అందిస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఉద్వానీ దగ్గర ప్రస్తుతం పాస్పోర్ట్ లేదు.. ఎలా మరి? అని ప్రశ్నించగా.. అంత కష్టపడొద్దు.. అధికారులు అక్కడ అరెస్ట్ చేసి తీసుకొస్తారులే అని న్యాయస్థానం చెప్పింది. అతడి తోటి నిందితుడు భారత్లో పోలీస్ కస్టడీలో మరణించాడు.. అందుకే నా పిటిషనర్ భారత్కు వచ్చాక సీసీటీవీ నిఘా ఉన్న గదిలోనే పెట్టాలని అడ్వకేట్ కోరగా.. ఇంక ఈ పిటిషన్పై విచారణ చేయలేమని ధర్మాసనం సీరియస్ కావడంతో ఆ పిటిషన్ను లాయర్ విత్ర డ్రా చేసుకున్నాడు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?