Omar Abdullah vs Lt Governor: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపై ఎల్జీ-ముఖ్యమంత్రి మధ్య రగడ
- జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపై రగడ
- ఒమర్ అబ్దుల్లా - లెఫ్టినెంట్ గవర్నర్ మాటల యుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదా అంశం మళ్లీ రగడ సృష్టిస్తోంది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మధ్య తీవ్ర వివాదం మొదలైంది. రాష్ట్ర హోదా విషయంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ మనోజ్ సిన్హా తీవ్రంగా ఆరోపించారు. రాష్ట్ర హోదాను సాకుగా చూపొద్దని.. ఎన్నికైన ప్రభుత్వానికి అవసరమైన అన్ని అధికారాలు ఉన్నాయని.. ప్రజల సంక్షేమం కోసం పని చేయాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ సూచించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపుతున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి కూడా కౌంటర్ ఎటాక్ చేశారు.
ఇది కూడా చదవండి: Off The Record : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ప్రభావం ఎంత? ఓటర్ల మైండ్ సెట్ ఈసారి ఎలా ఉండబోతుంది?
Also Read
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కౌంటర్ ఎటాక్ చేశారు. ‘‘మా పనేంటో మాకు తెలుసు. లెఫ్టినెంట్ గవర్నర్ తన మీద దృష్టి పెట్టాలి. పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. ఇదంతా అతని పర్యవేక్షణలోనే జరిగింది. తిరిగి మా పనేదో చూసుకోమంటూ సలహా ఇస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి ఎదురుదాడి చేశారు. రాష్ట్ర హోదా అంశాన్ని తాను ఎప్పుడూ లేవనెత్తుతూనే ఉంటానని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా తాను గతంలో ఆరు సంవత్సరాలు పనిచేసిన కాలంలో ఎప్పుడూ కూడా ఒక పర్యాటకుడికి కూడా హానీ జరగలేదన్నారు. ‘‘నేను భద్రతకు బాధ్యత వహిస్తే’’.. పహల్గామ్ లాంటి సంఘటన ఎన్నటికీ జరిగి ఉండేది కాదని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: with my old friend..! 393 అంబాసిడర్తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు..
రాష్ట్ర హోదా అంశాన్ని తాను ఎప్పుడూ లేవనెత్తుతూనే ఉంటానని.. సుప్రీంకోర్టు, పార్లమెంటులో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల గురించి మాట్లాడుతానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర హోదా వాగ్దానంపైనే ప్రజలు నమ్మకంతో అధికారం ఇచ్చారని.. ఆ వాగ్దానాన్ని ఎందుకు అమలు చేయడం లేదని కేంద్రాన్ని నిలదీశారు.
రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సరైన సమయం ఏమిటో కేంద్రం వివరించాలని ఒమర్ అబ్దుల్లా అన్నారు. ‘‘మీరు దానిని ఎలా కొలుస్తారు? రాష్ట్ర హోదాకు తగిన సమయాన్ని మీరు ఏ స్థాయిలో తూస్తారు? ముఖ్యమంత్రిగా నేను కనీసం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా కోసం నిర్దేశించిన లక్ష్యం లేదా లక్ష్యాన్ని తెలుసుకోవాలి.’’ అని ముఖ్యమంత్రి అడిగారు. గత ఆరు సంవత్సరాల కేంద్ర పాలనలో అభివృద్ధి రంగంలో లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా విఫలమయ్యారని ముఖ్యమంత్రి ఆరోపించారు.
తాజావార్తలు
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
-
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
-
Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!