Rajashree Swain: మహిళా క్రికెటర్ అనుమానాస్పద మృతి.. శరీరంపై గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Cricketer Rajashree Swain Found Dead In Katak Forest: ఒడిశాలో ఈనెల 11వ తేదీన కనిపించకుండా పోయిన మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్ అడవిలో శవమై కనిపించింది. కటక్కి సమీపంలో ఉన్న దట్టమైన అడవిలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఒక చెట్టుకు వేలాడుతూ, ఉరి వేసుకున్న స్థితిలో గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రాజశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. అసహజ మరణం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించగా.. రాజశ్రీ మృతదేహం లభ్యమైన కొంతదూరంలో ఆమె స్కూటర్ లభించింది. చెట్టుకు వేలాడుతూ కనిపించింది కాబట్టి.. ఆమె ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? అనేది ఇప్పుడే చెప్పలేమని.. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక ఆమె మృతికి కారణం తెలుస్తుందని డీసీపీ పినాక్ మిశ్రా వెల్లడించారు.
Kite String Slits Throat: మాంజా కాదు మృత్యుపాశం.. చిన్నారితో పాటు మరొకరు మృతి
Also Read
- Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
- IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- West Bengal Re-Poll: బెంగాల్ ఫల్తా ఓట్ల లెక్కింపు ప్రారంభం.. బీజేపీకి ఈ గెలుపు చాలా ముఖ్యం..
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
మరోవైపు.. రాజశ్రీ కుటుంబసభ్యులు ఆమెను హత్య చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని, కళ్లు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయని అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే.. దట్టమైన అడవికి వెళ్లాల్సిన అవసరం ఉండదన్న పాయింట్ని లేవనెత్తుతున్నారు. ఎవరో కుట్ర పన్ని రాజశ్రీని హతమార్చారని పేర్కొంటున్నారు. అయితే పోలీసులు మాత్రం పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామంటున్నారు. కాగా.. రాజశ్రీ స్వైన్ ఒడిశాలోని పూరీ జిల్లాకు చెందిన క్రికెటర్. పుదుచ్చేరిలో జరిగే క్రికెట్ టోర్నీ కోసం.. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు కటక్ వచ్చింది. అయితే.. 16 మందితో కూడిన జట్టులో మాత్రం ఆమె స్థానం సంపాదించుకోలేకపోయింది. జట్టులో తన పేరు లేకపోవడంతో.. రాజశ్రీ భోరున విలపించిందని ఆమె రూమ్మేట్ వెల్లడించింది. ఆ తర్వాత ఆమె హోటల్ గదికి రాలేదని తెలిపింది. రాజశ్రీ అదృశ్యంపై కోచ్ పుష్పాంజలి బెనర్జీ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.
Hindu Terrorism: హిందూ టెర్రరిజం అనేది లేదు.. ఆర్టీఐలో వెల్లడి.
తాజావార్తలు
-
Yamaha Ethanol Bike: ఇథనాల్తో నడిచే యమహా బైక్ భారత్లోకి ఎప్పుడు? కంపెనీ కీలక ప్రకటన
-
Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
-
IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
-
White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?