Athletes Travel At Train Toilets: అమానవీయ ఘటన.. టాయిలెట్స్ దగ్గర కూర్చుని ప్రయాణించిన అథ్లెట్లు
- ఉత్తర ప్రదేశ్ లో 69వ జాతీయ స్కూల్ రెజ్లింగ్ చాంఫియన్ షిప్ పోటీలు
- పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన 10 మంది బాలురు, 8 మంది బాలికలు
- టాయిలెట్ల దగ్గర కూర్చుని ప్రయాణించిన ఒడిశాకు చెందిన 18 మంది అథ్లెట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. టికెట్లు ధృవీకరణ కాకపోవడంతో ఒడిశాకు చెందిన 18 మంది అథ్లెట్లు రైలులోని టాయిలెట్ల సమీపంలో కూర్చుని ప్రయాణించిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్లో నిర్వహించిన 69వ జాతీయ స్కూల్ రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు ఒడిశా నుంచి 10 మంది బాలురు, 8 మంది బాలికలు కలిపి మొత్తం 18 మంది అథ్లెట్లు బయలుదేరారు. అయితే తిరుగు ప్రయాణానికి అవసరమైన ధృవీకరించబడిన రైలు టికెట్లు అందుబాటులో లేకపోవడంతో, వారు జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణించాల్సి వచ్చింది. దీంతో అథ్లెట్లు తమ లగేజీతో కలిసి రైలు టాయిలెట్ల వెలుపల ఇరుక్కుని, స్టీల్ ఫ్లోర్పై చలిలో కూర్చుని ప్రయాణించాల్సిన దయనీయ పరిస్థితి ఎదురైంది.
Also Read
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
- Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
ఈ విషయంపై ఒడిశా స్కూల్ మరియు సామూహిక విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోతి ప్రసాద్ పరిదా స్పందిస్తూ, తిరుగు ప్రయాణానికి కేవలం నలుగురు అథ్లెట్లకే టికెట్లు ధృవీకరించబడ్డాయని తెలిపారు. అయితే.. మిగిలిన అథ్లెట్లు ఈ పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, టాయిలెట్ సమీపంలో కూర్చుని ప్రయాణించడం తమకు మానసిక, శారీరక ఇబ్బందులకు గురి చేసిందని పేర్కొన్నారు.
ఒడిశా స్పోర్ట్స్ అథారిటీకి చెందిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఈ ఘటనను “నిర్వహణ లోపం”గా అభివర్ణించారు. తిరుగు ప్రయాణానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే అథ్లెట్లు అదే దయనీయ స్థితిలో తిరిగి రావాల్సి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటన క్రీడాకారుల భద్రత, గౌరవంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.
Student athletes return from UP by sitting next to toilets as Govt fails to provide them confirmed tickets. They went to UP under similar circumstances to participate in a sports meet. My story in @timesofindia today. https://t.co/6wm6JYBteu pic.twitter.com/LyzWhfPC9k
— Dianna Sahu (@DiannaSahu) December 23, 2025
తాజావార్తలు
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
-
Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
-
Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
-
Vijay Antony: సీఎం విజయ్ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్గా మారిన ఫోటోలు!
-
SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్కు కాటేరమ్మ కొడుకు దూరం..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!