Nupur Sharma: నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకు యువకుడిపై దాడి.. 8 మంది నిందితుల అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nupur Sharma-Prophet row: దేశంలో సంచలనం రేపిన నుపుర్ శర్మ వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. నుపుర్ శర్మకు మద్దతు తెలిపారనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు ఇతరులపై దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రెండు హత్యలు కూడా జరిగాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దాడి జరిగింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకు కొంతమంది వ్యక్తులు ఆయుష్ జాదవ్ (25) అనే భజరంగ్ దళ్ కార్యకర్తపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వా జిల్లాలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం బాధితుడు ఆయుష్ జాదవ్ మోటర్ సైకిల్ పై వెళ్తున్న క్రమంలో అడ్డగించి పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయుష్ తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు అయింది.
ఈ దాడిపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు నేషనల్ సెక్యురిటీ యాక్ట్ కేసులను ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేశారు. మొత్తం ఈ ఘటనలో 13 మంది పాల్గొనగా.. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మిగిలిన ఐదుగురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. మధ్యప్రదేశ్ లో శాంతి భద్రలకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిందితులపై ఐపీసీ 307 (హత్య ప్రయత్నం), 506 (నేరపూరిత బెదిరింపు) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
Also Read
- Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
- Cockroach Janta Party: "బొద్దింకల పార్టీ"పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
- Kolkata: మమత కట్టడాలపై బుల్డోజర్ చర్య.. సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ శిల్పం తొలగింపు
- Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
Read Also: National Herald Case: ఈడీ పేరిట సోనియా గాంధీని కేంద్ర ప్రభుత్వం వేధిస్తోంది
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశంలో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. దీని తరువాత కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నుపుర్ శర్మకు సోషల్ మీడియాలో మద్దతు తెలపిన కారణంగా ఉదయ్ పూర్ లో కన్హయ్యలాల్ అనే టైలర్ ను అత్యంత కిరాతకంగా ఇద్దరు మతోన్మాదులు తల నరికి హత్య చేశారు. ఈ ఘటనకు ముందే మహరాష్ట్ర అమరావతిలో ఉమేష్ కోల్హే అనే వ్యక్తిని కూడా దారుణంగా హత్య చేశారు. తాజాగా జరిగిన ఘటనపై అగర్ మాల్వా జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హిందూ గ్రూపులు ఎస్పీ కార్యాలయం ముందు నిందితులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.
తాజావార్తలు
-
Cockroach Janta Party: “బొద్దింకల పార్టీ”పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
-
Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
-
Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. ‘పెద్ది’ సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
-
Khatti Meethi Dal Recipe: తీపి + పులుపు మ్యాజిక్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడిగే గుజరాతీ కట్టి మీఠీ దాల్.!
-
Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!