Delhi Acid Attack: ఫ్లిప్కార్ట్లో యాసిడ్ కొన్న నిందితుడు.. అమెజాన్, ఫ్లిప్కార్టుకి DCW నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Acid Attack: ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో 17 ఏళ్ల అమ్మాయిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు నిందితుడు. బుధవారం ఉదయం రోడ్డుపై చెల్లితో నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిపై ఇద్దరు నిందితులు బైక్ పై వచ్చి ముఖంపై యాసిడ్ తో దాడి చేశారు. ఈ కేసులో బాధితురాలుకు తెలిసిన ఇద్దరు వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలు ఇచ్చిన వివరాలతో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు సంచలన విషయాలు వెల్లడించాడు. దాడికి ఉపయోగించిన యాసిడ్ ను ఫ్లిప్కార్ట్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపాడు.
Read Also: Live In Relation: కేరళ శ్రద్ధా వాకర్గా సింధు.. యువతిని నరికి చంపిన లవర్
Also Read
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
ఈ దాడిలో బాలిక ముఖం, మెడపై 8 శాతం కాలిన గాయాలు అయినట్లు వైద్యులు వెల్లడించారు. బాధితురాలు 12 తరగతి చదువుతోంది. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉంది. కాలిన గాయాలు ఎంత వరకు చర్మంపై ప్రభావం చూపించాయనే విషయం నిర్థారించేందుకు 48 నుంచి 72 గంటల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ప్రధాన నిందితుడు సచిన్ అరోరా, బాలికతో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. అయితే మూడు నెలల క్రితం వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. దీంతో బాలికపై పగ పెంచుకున్న సచిన్ తన ఇద్దరు మిత్రులు హర్షిత్, వీరేంద్రలతో కలిసి దాడికి ప్లాన్ చేశారు. ఫ్లిప్కార్ట్ నుండి ఆన్లైన్లో యాసిడ్ను ఆర్డర్ చేసాడు.
ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్(DCW) సీరియస్ అయింది. బాధితురాలికి న్యాయం చేయాలని కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఆన్లైల్ లో యాసిడ్ అమ్మకాలపై ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లకు నోటీసులు జారీ చేసింది. యాసిడ్ దాడులు పెరగడంతో యాసిడ్ విక్రయాలపై 2013లో సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అయినా అమ్మకాలు జరుగుతుండటంపై సీరియస్ అయింది. కూరగాయలు కొనుగోలు చేసినంత సులువుగా యాసిడ్ లభిస్తుందని ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాతి మలివాల్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!