Rudraprayag: గ్రామాల్లోకి హిందువులు కాని వారికి, రోహింగ్యా ముస్లింలకు ప్రవేశం నిషేధం..
- ఉత్తరాఖండ్ గ్రామాల్లో పోస్టర్ల కలకలం..
- హిందువులు కానివారికి..రోహింగ్యా ముస్లింలకు ప్రవేశం నిషేధం..
- చమోలీ ఘటన తర్వాత నుంచి వెలిసిన పోస్టర్లు..
- విచారణ ప్రారంభించిన పోలీసులు..
- నిరసన తెలుపుతున్న ఎంఐఎం.. కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rudraprayag: ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని పలు గ్రామాల్లో హిందువులు కానివారి ప్రవేశాన్ని నిషేధిస్తూ పోస్టర్లు వెలిశాయి. నాన్-హిందువులు, రోహింగ్యా ముస్లింల ప్రవేశాన్ని నిషేధించారు. గత వారం చమోలిలో లైంగిక వేధింపుల కేసు తర్వాత ఇలాంటి పోస్టర్లు కనిపించాయి. ఈ ఘటన తర్వాత ఓ వర్గంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసేంత వరకు రుద్రప్రయాగలో ఉద్రిక్తలు తగ్గలేదు. ప్రస్తుతం ముస్లిం వ్యాపారులను గ్రామాల్లోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తూ హెచ్చరిస్తున్న పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ పోస్టర్లపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
ఉత్తరాఖండ్ పోలీస్ అధికార ప్రతినిధి దినేష్ భర్నే రుద్రప్రయాగ్లో ఇలాంటి పోస్టర్లను ధృవీకరించారు. పరిస్థితిని అదపులోకి తెచ్చేందుకు స్థానికులతో పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు. మత సామరస్యానికి భంగం కలిగించే ఏ ప్రయత్నమైనా సంబంధిత చట్టపరమైన నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు బయటి వ్యక్తులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
Also Read
Read Also: MPOX: అలర్ట్..భారత్ లోకి మంకీపాక్స్ ఎంట్రీ! విదేశాల నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి వైరస్ లక్షణాలు!
పోస్టర్లు ఎందుకు వెలిశాయి..?
రుద్రప్రయాగ్ జిల్లాలో, సోన్ ప్రయాగ్ గ్రామంలోకి ‘‘హిందువులు కాని వారు, రోహింగ్యాలు గ్రామంలోకి ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటాము’’ అనే బోర్డు వెలుగులోకి వచ్చాయి. గత వారం చమోలీలో జరిగిన లైంగిక వేధింపుల కేసు రాష్ట్రంలో ఉద్రిక్తతలకు కారణమైంది.
రుద్రప్రయాగ్లోని సిర్సి గ్రామాని చెందిన అశోక్ సెమ్వాల్ మాట్లాడుతూ.. చాలా మంది గ్రామస్తులు పనుల కోసం బయటకు వెళ్తున్న క్రమంలో, ఇంట్లో ఉన్న మహిళలు ఒంటరిగా ఉంటున్నారని, ఇది సంఘటన ప్రమాదాన్ని పెంచుతోందని చెప్పారు. గతంలో జరిగి ఆలయం చోరీని ఉటంకిస్తూ, గుర్తుతెలియని వ్యక్తులు గ్రామాల్లోకి రాకుండా పోస్టర్లు అంటించామని చెప్పారు.
ఎంఐఎం, కాంగ్రెస్ నిరసన:
ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నయ్యర్ కజ్మీ ఉత్తరాఖండ్ డీజీపీని కలిశారు. సైన్ బోర్డులు ఏర్పాటు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల వివాదం తర్వత ముస్లిం ఇళ్లపై దాడి చేసి లూటీ చేశారని, చాలా మంది పారిపోయేలా చేశారని కజ్మీ ఆరోపించారు. వారం రోజుల్లో చర్యలు చేపట్టకపోతే అసదుద్దీన్ ఓవైసీ మార్గదర్శకత్వంలో నిరసన చేపడుతామని చెప్పారు. నేరాలకు పాల్పడే వారిని మాత్రమే నేరస్తులుగా పరిగణించాలని, మొత్తం ఓ సమాజాన్ని శిక్షించరానిన కాంగ్రెస్ నేత గణేష్ గోడియాల్ అన్నారు.
తాజావార్తలు
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!