Non-bailable warrant against Nithyananda: నిత్యానందపై నాన్ బెయిలబుల్ వారెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామిజీపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు.. నిత్యానందపై 2010లో అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే కాగా.. ఆయన మాజీ డ్రైవర్ లెనిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ సాగుతోంది.. అయితే, ఈ కేసులో నిత్యానంద 2019 నుంచి విచారణకు రాకపోవడంతో బెంగళూరులోని రామనగర అదనపు జిల్లా సెషన్స్ కోర్టు .. ఇప్పుడు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వచ్చే నెల 23లోగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.. గతంలోనే అతనిపై ఓపెన్-ఎండ్ వారెంట్ కూడా జారీ చేయబడింది, అయితే, పోలీసులు నిత్యానంద ఆచూకీ కనిపెట్టలేకపోయారు.. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు సాక్షులను విచారించారు, నిందితుడిగా ఉన్న నిత్యానంద లేకపోవడంతో గత మూడేళ్లుగా విచారణ నిలిచిపోయింది.
Read Also: Reliance Jio plans: కొత్త ప్లాన్స్ తెచ్చిన జియో.. రోజుకి 2 జీబీ డేటా, ఓటీటీ ఆఫర్లు సహా మరిన్ని..!
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
నిత్యానందపై అత్యాచారం కేసు అతని మాజీ డ్రైవర్ లెనిన్ ఫిర్యాదు ఆధారంగా 2010లో నమోదు చేయబడింది.. అంతేకాదు నిత్యానందను అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఆయన బెయిల్పై విడుదల కావడం జరిగిపోయాయి.. అయితే, 2020లో నిత్యానంద దేశం నుంచి పారిపోయాడంటూ లెనిన్ చేసిన పిటిషన్పై మళ్లీ బెయిల్ను రద్దు చేసింది కోర్టు.. కాగా, దేశం విడిచి వెళ్లిపోయిన నిత్యానంద.. కైలాసం అని పిలిచే ప్రదేశంలో తన ఆశ్రమాన్ని స్థాపించినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ స్థలం ఎక్కడుందనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసి.. దానికే కైలాసం అని పేరు పెట్టి.. ఓ దేశంగా ప్రకటించేకునే ప్రయత్నం కూడా చేస్తున్నారని.. ప్రత్యేక ఎయిర్పోర్ట్, ప్రత్యేక కరెన్సీ.. ఇలా అనేక ప్రచారాలు జరిగాయి.. అయితే, ఆయన తమ దేశంలో లేరని ఈక్వెడార్ ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు.. నిత్యానంద రహస్య ప్రాంతం నుంచి మాట్లాడిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.. మొత్తంగా కోర్టుకు హాజరు కావాలంటూ అనేకసార్లు సమన్లు పంపినా సమాధానం రాకపోవడంతో.. ఇప్పుడు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మరి.. తన కైలాసం నుంచి నిత్యానంద వచ్చేనా? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!