Noida Protest: నోయిడా ఘటన వెనుక భారీ కుట్ర.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
- నోయిడా ఘటన వెనుక భారీ కుట్ర
- వెలుగులోకి షాకింగ్ విషయాలు
- సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కనీస వేతనాలు పెంచాలంటూ నోయిడా కార్మికులు ఆందోళనకు దిగారు. డిమాండ్ల కోసం రోడ్డెక్కడం తప్పేమీ కాదు. కానీ నిరసనల పేరుతో విధ్వంసం సృష్టించడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అవాక్కైంది. సోమవారం వేతనాల కోసం రోడ్డెక్కిన కార్మికులు.. కానీ అంతలోనే రణరంగంగా మారిపోయింది. ఆస్తులు ధ్వంసం చేయడం, వాహనాలు తగలబెట్టడం క్షణాల్లో తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయింది. పోలీసులు రంగం ప్రవేశం చేసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో పోలీస్ శాఖ షాక్కు గురైంది.

Also Read
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
- High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
- Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
- PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
అయితే నోయిడా రణరంగంపై ప్రభుత్వం సీరియస్ అయింది. అయితే ఆందోళనలపై ఆరా తీయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కార్మికుల నిరసనల్లోకి బయట వ్యక్తులు ప్రవేశించినట్లుగా ప్రభుత్వానికి పోలీసులు నివేదించారు. నోయిడా ఘర్షణల వెనుక పాకిస్థాన్ ప్రమేయం ఉందని ఉత్తర ప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్భర్ ఆరోపించారు. పాకిస్థాన్ ప్రమేయంపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.

ఇక నిన్నటి ఆందోళనల్లో ప్రమేయం ఉన్న 300 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో వంద మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే ఫ్యాక్టరీల్లో ఉన్న సీసీ కెమెరాలను, రహదారులపై ఉన్న కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. బయట వ్యక్తులు ఎలా ప్రవేశించారన్న దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఈ కుట్ర జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా కార్మికులకు యోగీ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. 21 శాతం కార్మికుల జీతాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినా కూడా నేడు కూడా పలుచోట్ల కార్మికులు నిరసనలు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
-
High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
-
Fake Currency : యూట్యూబ్ చూసి నకిలీ నోట్లు.. హైదరాబాద్లో బిగ్ గ్యాంగ్ గుట్టురట్టు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!