Noida Protest: నోయిడా ఘటన వెనుక భారీ కుట్ర.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
- నోయిడా ఘటన వెనుక భారీ కుట్ర
- వెలుగులోకి షాకింగ్ విషయాలు
- సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కనీస వేతనాలు పెంచాలంటూ నోయిడా కార్మికులు ఆందోళనకు దిగారు. డిమాండ్ల కోసం రోడ్డెక్కడం తప్పేమీ కాదు. కానీ నిరసనల పేరుతో విధ్వంసం సృష్టించడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అవాక్కైంది. సోమవారం వేతనాల కోసం రోడ్డెక్కిన కార్మికులు.. కానీ అంతలోనే రణరంగంగా మారిపోయింది. ఆస్తులు ధ్వంసం చేయడం, వాహనాలు తగలబెట్టడం క్షణాల్లో తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయింది. పోలీసులు రంగం ప్రవేశం చేసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో పోలీస్ శాఖ షాక్కు గురైంది.

Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
అయితే నోయిడా రణరంగంపై ప్రభుత్వం సీరియస్ అయింది. అయితే ఆందోళనలపై ఆరా తీయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కార్మికుల నిరసనల్లోకి బయట వ్యక్తులు ప్రవేశించినట్లుగా ప్రభుత్వానికి పోలీసులు నివేదించారు. నోయిడా ఘర్షణల వెనుక పాకిస్థాన్ ప్రమేయం ఉందని ఉత్తర ప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్భర్ ఆరోపించారు. పాకిస్థాన్ ప్రమేయంపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.

ఇక నిన్నటి ఆందోళనల్లో ప్రమేయం ఉన్న 300 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో వంద మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే ఫ్యాక్టరీల్లో ఉన్న సీసీ కెమెరాలను, రహదారులపై ఉన్న కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. బయట వ్యక్తులు ఎలా ప్రవేశించారన్న దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఈ కుట్ర జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా కార్మికులకు యోగీ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. 21 శాతం కార్మికుల జీతాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినా కూడా నేడు కూడా పలుచోట్ల కార్మికులు నిరసనలు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?