Ernest Mawrie: నేను కూడా “బీఫ్” తింటా.. రాష్ట్ర బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meghalaya: మేఘాలయ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడ ఎర్నెస్ట్ మావ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. మేఘాలయలో బీఫ్ తినడంపై ఎలాంటి ఆంక్షలు లేవని.. నేను కూడా బీఫ్ తింటానని మావ్రీ అన్నారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు ఆమోదించిన తీర్మానంపై నేనుమాట్లాడనని..మేఘాలయంలో అందరూ బీఫ్ తింటారని, దీనికి ఎలాంటి ఆంక్షలు లేవని అన్నారు. ఇది ఇక్కడి ప్రజల జీవనశైలి అని చెప్పారు. దీనిని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. మేఘాలయలో కబేళాలు ఉన్నాయి, అందరూ ఆవును లేదా పందని మార్కెట్ కు తీసుకువస్తారని అన్నారు.
Read Also: High Court: కుక్కల దాడిలో బాలుడు మృతి.. నేడు హైకోర్టు విచారణ
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
అస్సాం వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు పశువధ, గోమాంసం రవాణా, విక్రయాలపై నియంత్రణ బిల్లును ఆమోదించిన తరుణంతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ.. ఈశాన్య రాష్ట్రాల్లో హిందువులు నివసించే చోట బీఫ్ తినడాన్ని నిషేధించాలని కోరారు. అయితే బీజేపీ క్రైస్తవ వ్యతిరేక పార్టీ అని కొన్ని రాజకీయా పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ మేఘాలయ బీజేపీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు చేసేవి రాజకీయ ప్రచారం మాత్రమే అని కొట్టిపారేశారు.
దేశంలో తొమ్మిదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం నడుస్తోందని.. దేశంలో ఏ చర్చిపై ఇప్పటి వరకు టార్గెటెడ్ దాడులు జరగలేదని, బీజేపీ క్రైస్తవ వ్యతిరేక పార్టీ కాదని ఆయన ఎర్నెస్ట్ మావ్రీ అన్నారు. మేఘాలయ క్రైస్తవులు అధికంగా ఉండే రాష్ట్రమని, ప్రజలు ఎక్కువగా చర్చిలకు వెళతారని ఆయన గుర్తు చేశారు. గోవా, నాగాలాండ్ లో బీజేపీ అధికారంలో ఉంది, అక్కడ ఏ ఒక్క చర్చిని లక్ష్యంగా చేసుకోలేదని, కాంగ్రెస్, టీఎంసీ వంటి పార్టీలు కావాలనే ఇలాంటి రాజకీయ ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్దారు. నేను కూడా క్రిస్టియన్ నే, వారు నన్ను ఎప్పుడూ చర్చికి వెళ్లవద్దని చెప్పలేదని, మేఘాలయలో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఫిబ్రవరి 27న మేఘాలయలో ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!