Ernest Mawrie: నేను కూడా “బీఫ్” తింటా.. రాష్ట్ర బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meghalaya: మేఘాలయ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడ ఎర్నెస్ట్ మావ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. మేఘాలయలో బీఫ్ తినడంపై ఎలాంటి ఆంక్షలు లేవని.. నేను కూడా బీఫ్ తింటానని మావ్రీ అన్నారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు ఆమోదించిన తీర్మానంపై నేనుమాట్లాడనని..మేఘాలయంలో అందరూ బీఫ్ తింటారని, దీనికి ఎలాంటి ఆంక్షలు లేవని అన్నారు. ఇది ఇక్కడి ప్రజల జీవనశైలి అని చెప్పారు. దీనిని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. మేఘాలయలో కబేళాలు ఉన్నాయి, అందరూ ఆవును లేదా పందని మార్కెట్ కు తీసుకువస్తారని అన్నారు.
Read Also: High Court: కుక్కల దాడిలో బాలుడు మృతి.. నేడు హైకోర్టు విచారణ
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
అస్సాం వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు పశువధ, గోమాంసం రవాణా, విక్రయాలపై నియంత్రణ బిల్లును ఆమోదించిన తరుణంతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ.. ఈశాన్య రాష్ట్రాల్లో హిందువులు నివసించే చోట బీఫ్ తినడాన్ని నిషేధించాలని కోరారు. అయితే బీజేపీ క్రైస్తవ వ్యతిరేక పార్టీ అని కొన్ని రాజకీయా పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ మేఘాలయ బీజేపీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు చేసేవి రాజకీయ ప్రచారం మాత్రమే అని కొట్టిపారేశారు.
దేశంలో తొమ్మిదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం నడుస్తోందని.. దేశంలో ఏ చర్చిపై ఇప్పటి వరకు టార్గెటెడ్ దాడులు జరగలేదని, బీజేపీ క్రైస్తవ వ్యతిరేక పార్టీ కాదని ఆయన ఎర్నెస్ట్ మావ్రీ అన్నారు. మేఘాలయ క్రైస్తవులు అధికంగా ఉండే రాష్ట్రమని, ప్రజలు ఎక్కువగా చర్చిలకు వెళతారని ఆయన గుర్తు చేశారు. గోవా, నాగాలాండ్ లో బీజేపీ అధికారంలో ఉంది, అక్కడ ఏ ఒక్క చర్చిని లక్ష్యంగా చేసుకోలేదని, కాంగ్రెస్, టీఎంసీ వంటి పార్టీలు కావాలనే ఇలాంటి రాజకీయ ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్దారు. నేను కూడా క్రిస్టియన్ నే, వారు నన్ను ఎప్పుడూ చర్చికి వెళ్లవద్దని చెప్పలేదని, మేఘాలయలో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఫిబ్రవరి 27న మేఘాలయలో ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!